సంక్షిప్త వార్తలు (6)
‘ధమాకా’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు.
దండ కడియాల్.. దస్తి రుమాల్
‘ధమాకా’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా గురువారం ఈ సినిమా నుంచి ‘‘దండ కడియాల్.. దస్తి రుమాల్.. మస్తుగున్నోడంటివె పిల్లో’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చడమే కాక సాహిత్యమందించి స్వయంగా ఆలపించారు. ఆయనతో పాటు సాహితీ చాగంటి, మంగ్లీ కూడా గొంతు కలిపారు. జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. వినోదం నిండిన మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ప్లే అందించారు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
ట్రోల్స్ని ఆస్వాదిస్తుంటా
‘‘నటిగా కంటే కూడా... టెలివిజన్ కార్యక్రమాలతోనే నన్ను నేనుగా ఆవిష్కరించుకునే అవకాశం లభిస్తుంద’’ని చెప్పారు మంచు లక్ష్మి. అప్పుడప్పుడూ తెరపై మెరుస్తూ... టెలివిజన్ కార్యక్రమాలతోనూ సందడి చేస్తుంటారామె. ఇటీవల మలయాళంలో మోహన్లాల్తో కలిసి ‘మాన్స్టర్’ సినిమాలో నటించారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘మంజు దుర్గ అనే ఓ మంచి పాత్రని చేశా. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాష పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కున్నా. వాళ్ల సంభాషణలు పొడవుగా ఉంటాయి. ఆ భాషని, పాత్రని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. మోహన్లాల్తో ఏడాదికి ఒక సినిమాలోనైనా నటించాలని ఉంది. ఆ విషయం ఆయనతో కూడా చెప్పా’’ అన్నారు. తనపై సామాజిక అనుసంధాన వేదికల్లో వచ్చే ట్రోల్స్ని, తనపై మీమ్స్ని ఆస్వాదిస్తుంటానని చెప్పారు లక్ష్మి. ్రప్రస్తుతం ‘గాంబ్లర్’, ‘లేచింది మహిళాలోకం’, ‘అగ్నినక్షత్రం’ సినిమాల్లో నటిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆ చిత్రం ఆగిపోయిందా?
కమల్హాసన్ జోరుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో ఒకటి మహేష్ నారాయణ్తో చేయాల్సిన సినిమా. ‘తేవర్ మగన్’కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లు తమిళవర్గాల సమాచారం. సృజనాత్మక భేదాల కారణంగా ఇరువురి ఇష్ట ప్రకారమే ఈ సినిమాని నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ నెలాఖరులో సెట్స్పైకి వెళ్లాలి. ఎడిటర్, దర్శకుడు అయిన మహేష్ నారాయణ్ గతంలో కమల్ నటించిన ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు.
‘డెవిల్’ కోసం కారైకుడీకి
కల్యాణ్రామ్ విజయోత్సాహంలో ఉన్నారు. ‘బింబిసార’తో అలరించిన ఆయన, ప్రస్తుతం ‘అమిగోస్’, ‘డెవిల్’ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ‘డెవిల్’ కోసం శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నట్టు ఇటీవలే ట్విటర్ ద్వారా ప్రకటించారు కల్యాణ్రామ్. ఆ సినిమా చిత్రీకరణ కోసమే తమిళనాడులోని కారైకుడి బయల్దేరి వెళ్లారు. 20 రోజులపాటు అక్కడ చిత్రీకరణ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. పీరియాడికల్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో కల్యాణ్రామ్, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
‘పారసైట్’ దర్శకుడి చిత్రం ఆరోజే
‘ది ట్విలైట్ సాగా’, ‘బ్యాట్మన్’ చిత్రాల కథానాయకుడు రాబర్ట్ ప్యాటిన్సన్. ‘పారసైట్’ దర్శకుడు బాంగ్ జూన్ హో. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ప్రాజెక్టు ‘మిక్కీ 17’. ఎడ్వర్డ్ ఆస్టన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. హాలీవుడ్, దక్షిణకొరియా సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇది మార్చి 29, 2024న థియేటర్లలోకి వస్తుందని సినీవర్గాలు ప్రకటించాయి. ప్లాన్ బీ ఎంటర్టైన్మెంట్, కేట్ స్ట్రీట్ పిక్చర్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ నామినీ.. డేరియస్ ఖోండ్జీ ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ప్రీ రిలీజ్ హంగామా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM