Actress: విరబూశాయి... కొత్తందాలు
చిత్రసీమకి ఊపిరి... కొత్తదనం. భవిష్యత్తు కొత్తతరం! మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా కథల్లోనూ... సాంకేతికతలోనూ... నటనలోనూ ఇలా అన్నిచోట్లా కొత్తదనం కనిపించాల్సిందే.
2022లో తెలుగు తెరపై మెరిసిన నూతన నాయికలు
చిత్రసీమకి ఊపిరి... కొత్తదనం. భవిష్యత్తు కొత్తతరం! మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా కథల్లోనూ... సాంకేతికతలోనూ... నటనలోనూ ఇలా అన్నిచోట్లా కొత్తదనం కనిపించాల్సిందే. కొత్తదనం అంటే కొత్తతరంతోనే సాధ్యం అని పరిశ్రమ నమ్మిన ప్రతిసారీ తెరపైన ఓ నవ తార మెరుస్తుంది. లేదంటే ఓ యువ దర్శకుడో, సాంకేతిక నిపుణుడో పరిచయం అవుతుంటాడు. అలా ఏటా సినీ రంగంలో కొత్త నీరు పరవళ్లు తొక్కుతూనే ఉంటాయి. ఈ ఏడాదీ తెలుగు తెరకు పదుల సంఖ్యలో
కథానాయికలు పరిచయమై నయా శోభని తీసుకొచ్చారు.
చిత్రసీమకి కథానాయికలు కీలకం. హీరోల సంఖ్యకి తగ్గట్టుగా నాయికలు లేకపోవడంతో తరచూ ఆ కొరత సినీ రూపకర్తల్ని వేధిస్తుంటుంది. కథానాయికల కోసం ప్రత్యేకంగా అన్వేషణ కొనసాగించాల్సి వస్తుంటుంది. అందుకే కొత్తందం తెరపై మెరిసిందంటే చాలు... మన సినిమాకి పనికొస్తుందా అంటూ అటువైపు చూస్తుంటారు. 2021లో విడుదలైన ‘ఉప్పెన’తో, ‘పెళ్లిసంద‘డి’ సినిమాలతో మెరిసిన కృతిశెట్టి, శ్రీలీల ప్రస్తుతం అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాల్ని అందుకుంటూ జోరు ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది కూడా కొత్తందాలకి కొదవేం లేదు. అయితే ఈసారి పొరుగు భాషల నుంచి వచ్చినవాళ్లే ఎక్కువ.
హిందీ నాయికల జోరు
2022లో దర్శకులు కొత్త కథానాయికల్ని పరిచయం చేయడంకంటే, పొరుగు భాషల్లో సత్తా చాటుతున్న భామల్ని మన తెరపైకి తీసుకు రావడంపై మొగ్గు చూపారు. పాన్ ఇండియా మార్కెట్టే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అలియాభట్, విజయ్ దేవరకొండ ‘లైగర్’తో అనన్యపాండే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. హిందీలో స్టార్లుగా కొనసాగుతున్న ఈ నాయికలు తెలుగులో నటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత్ర విషయంలో అలియా అభిమానులు కొంచెం అసంతృప్తి చెందినా, ఆమె విజయాన్ని మాత్రం నమోదు చేసింది. ఆ ఊపులో ఎన్టీఆర్తో కలిసి మరో సినిమాకీ ఆమె పచ్చజెండా ఊపింది. కానీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో మనసు మార్చుకుంది. ఆ ప్రాజెక్టు కూడా ఆలస్యమైంది. ‘లైగర్’తో అనన్యపాండే మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మరో హిందీ భామ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’తో తెలుగు కుర్రాళ్ల మనసుల్ని గెలిచింది. హిందీలోనే రెండు సినిమాలు చేసిన షిర్లే సేటియా ‘కృష్ణ వ్రింద విహారి’తో, మిథిలాపాల్కర్ ‘ఓరి దేవుడా’ సినిమాతో సందడి చేశారు. వీళ్ల అందం, నటన పరిశ్రమని ఆకట్టుకున్నాయి.
మలయాళం నుంచి...
‘భీమ్లానాయక్’, ‘బింబిసార’ సినిమాలతో పరిచయమైన మలయాళీ భామ సంయుక్తమేనన్ ఈ ఏడాది తెలుగు పరిశ్రమని బాగా ఆకట్టుకుంది. ఆమె ప్రస్తుతం ధనుష్తో కలిసి ద్విభాషా చిత్రం ‘సార్’లో నటిస్తోంది. ఈసారి ప్రేక్షకుల్ని బాగా ఊరించిన మరో మలయాళ భామ నజ్రియా. నానితో కలిసి ‘అంటే సుందరానికి’ చిత్రంలో నటించింది. అంతకుముందు అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె, నేరుగా నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే. కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’తో తెలుగులో సందడి చేసిన మలయాళ భామ రజీషా విజయన్ కూడా అంతే. విజయం దక్కలేదు. ‘గాడ్సే’ సినిమాతో పరిచయమైన ఐశ్వర్యలక్ష్మి ఈసారి తెలుగుపై బలమైన ముద్ర వేశారు. ‘మట్టికుస్తీ’, ‘అమ్ము’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. వీళ్లతోపాటుగా... తెలుగుకు ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’తో పరిచయమైన రితిక నాయక్ నటన, అందం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’తో సంచిత బసు, ‘అల్లూరి’ సినిమాతో కయాదు లోహార్, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రంతో సంజన ఆనంద్, సోను ఠాకూర్, ‘హైవే’తో మానస రాధాకృష్ణ తెలుగుకు పరిచయమయ్యారు. కృతిశెట్టి, శ్రీలీల తరహాలో పరిచయ చిత్రంతోనే ప్రభావం చూపించిన భామలు ఈ ఏడాది కనిపించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం