Tollywood: అందాల ‘ప్రత్యేక’ కనువిందు
సినిమాల్లో ప్రత్యేక గీతానికి ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. సినిమాకి అదనపు ఆకర్షణ జోడించాలన్నా.. కథానాయకులతో మాస్ స్టెప్పులు వేయించాలన్నా.. మాస్ ప్రేక్షకుల్ని ఊరిస్తూ థియేటర్లకు రప్పించాలన్నా.. దర్శక నిర్మాతలు తొలుత చూసేది స్పెషల్ సాంగ్ వైపే.
2022లో అలరించిన ఐటెమ్ సాంగ్స్
సినిమాల్లో ప్రత్యేక గీతానికి ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. సినిమాకి అదనపు ఆకర్షణ జోడించాలన్నా.. కథానాయకులతో మాస్ స్టెప్పులు వేయించాలన్నా.. మాస్ ప్రేక్షకుల్ని ఊరిస్తూ థియేటర్లకు రప్పించాలన్నా.. దర్శక నిర్మాతలు తొలుత చూసేది స్పెషల్ సాంగ్ వైపే. హీరో పరిచయ గీతాల్లోనూ లేనంత మజా ఈ పాటల్లో కనిపిస్తుంటుంది. అందుకే ప్రత్యేక గీతాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది తెలుగు చిత్రసీమ. ఎప్పట్లాగే ఈ ఏడాదీ తెలుగులో ఐటెమ్ గీతాలు హోరెత్తాయి. అయితే వాటిలో సినిమా జాతకాన్ని నిర్ణయించే స్థాయి ఏ పాటకూ దక్కలేదు. కొన్ని గీతాలు మాత్రం ఆయా సినిమాలకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. మరి ఈ ఏడాది సినీప్రియుల్ని కవ్వించి.. మురిపించిన ఆ ప్రత్యేక గీతాలపై ఓ లుక్కేద్దాం పదండి...
సినిమాలో ఐటెమ్ బాంబ్ అంటూ ప్రత్యేకంగా ఓ పాట ఉంటే ఆ ఊపే వేరుగా ఉంటుంది. ఇక అగ్ర కథానాయకుల చిత్రాల్లో అలాంటి పాట పడిందంటే థియేటర్లలో ప్రేక్షకులు ఈల వేసి గోల చేయాల్సిందే. కొవిడ్ భయాల వల్ల ఈసారి సంక్రాంతికి పెద్దగా అగ్ర కథానాయకుల సందడి కనిపించలేదు. ‘బంగార్రాజు’తో నాగార్జునే ఆ లోటును కాస్త భర్తీ చేసే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో ‘‘వాసివాడీ తస్సాదియ్యా..’’ అంటూ నాగ్తో పాటు ఆయన తనయుడు చైతన్యతో కలిసి అదిరిపోయేలా మాస్ స్టెప్పులేసింది యువ కథానాయిక ఫరియా అబ్దుల్లా. ఈ పాటకు దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్వయంగా సాహిత్యమందించగా.. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. దీనికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ‘‘కల్లోలం.. కల్లోలం.. ఊరూవాడా కల్లోలం’’ అంటూ ‘ఆచార్య’లోని ప్రత్యేక గీతంతో సినీప్రియుల గుండెల్లో కల్లోలం రేపింది నటి రెజీనా. చిరంజీవి - రామ్చరణ్ కలిసి నటించిన చిత్రమిది. కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమా కోసమే చిరులోని మాస్ ఎనర్జీని ఆవిష్కరించేలా భాస్కరభట్లతో కలిసి ‘‘కల్లోలం..’’ పాటను ప్రత్యేకంగా రాయించారు దర్శకుడు కొరటాల. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టినప్పటికీ.. ఈ ప్రత్యేక గీతానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.
‘రామారావు ఆన్ డ్యూటీ’తో శ్రీకాకుళం సారంగిగా ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది నటి అన్వేషి జైన్. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శరత్ మండవ తెరకెక్కించారు. ఈ సినిమాలోని ‘‘నా పేరు సీసా..’’ అనే ప్రత్యేక గీతంలో రవితేజతో కలిసి ఆడిపాడింది అన్వేషి. ఈ పాటకు సామ్ సిఎస్ స్వరాలు సమకూర్చగా.. శ్రేయా ఘోషల్ ఆలపించింది. ‘బింబిసార’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన మరో ప్రత్యేక అందం వరీనా హుస్సేన్. ఇందులో ‘‘గుళేబకావళి పువ్వులాంటి యవ్వనం..’’ పాటలో కల్యాణ్ రామ్తో కాలుకదిపిన ఈ అందం.. ఆ వెంటనే ‘గాడ్ఫాదర్’లో ఆడిపాడే అవకాశం అందుకుంది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి చేసే ఓ ఫైట్ సీక్వెన్స్లో ‘‘బ్లాస్ట్ బేబీ’’ అంటూ ప్రత్యేక పాటతో ప్రేక్షకుల్ని హుషారెత్తించింది వరీనా. ‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘‘రా రా రెడ్డి.. ఐయామ్ రెడీ’’ పాటలో అందాలు ఆరబోసింది నటి అంజలి. నితిన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. దీనికి ప్రేక్షకుల నుంచి చేదు ఫలితం దక్కినప్పటికీ.. ఇందులోని ‘‘రా రా రెడ్డి’’ పాటకు మంచి ఆదరణే దక్కింది. ఈ పాటలోని ఓ చిన్న బిట్లో ‘జయం’లోని ‘‘రాను రానంటూనే చిన్నదో’’ గీతాన్ని రీమిక్స్ చేసి వినిపించారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. దానికి నితిన్ - అంజలి కలిసి వేసిన స్టెప్పులకు సినీప్రియుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఇక ఇటీవల విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’లోని ‘‘జారు మిఠాయా’’ పాటకూ నెట్టింట మంచి ఆదరణ లభించింది.
‘‘జిగేలు రాణి’’ అంటూ గతంలో ‘రంగస్థలం’ చిత్రంలోని ప్రత్యేక గీతంతో కుర్రకారును ఉర్రూతలూగించింది నటి పూజా హెగ్డే. ఆమె ఈ ఏడాది ‘ఎఫ్3’ కోసం మరోసారి ఐటెమ్ బాంబుగా మారిపోయింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. ‘ఎఫ్2’కు కొనసాగింపుగా రూపొందించారు. ఈ చిత్రం కోసమే ‘‘అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా’’ అనే ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటలోనే వెంకీ - వరుణ్లతో కలిసి హుషారెత్తించేలా స్టెప్పులేసింది పూజా. కాసర్ల శ్యామ్ సాహిత్యంతో రూపుదిద్దుకున్న ఈ పాట.. సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. అటు ఉత్తరాదిలోనూ.. ఇటు దక్షిణాదిలోనూ పలు ఐటెమ్ గీతాల్లో నర్తించి మురిపించిన ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఆమె ఈ ఏడాది ‘విక్రాంత్ రోణ’లోని ‘‘రా రా రక్కమ్మ’’ పాటతో మాస్ పల్స్ రేట్ ఒక్కసారిగా పెంచేసింది. కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రమిది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ఈ పాటకు మాత్రం దేశవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభించింది. ఈ గీతానికి తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. మంగ్లీ ఆకట్టుకునేలా ఆలపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు (Latest News)
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె