‘ప్రేమ’కు జై కొట్టారు
ప్రేమ లేని సినిమాలు అరుదు. ఊర మాస్, ఫాంటసీ, థ్రిల్లర్... కథా నేపథ్యం ఏదైనా.. అందులో ఎక్కడో ఒక చోట ప్రేమకి చోటిస్తుంటారు. అందులో నుంచే వాణిజ్యాంశాల్ని సృష్టిస్తుంటారు.
ప్రేమ లేని సినిమాలు అరుదు. ఊర మాస్, ఫాంటసీ, థ్రిల్లర్... కథా నేపథ్యం ఏదైనా.. అందులో ఎక్కడో ఒక చోట ప్రేమకి చోటిస్తుంటారు. అందులో నుంచే వాణిజ్యాంశాల్ని సృష్టిస్తుంటారు. అలా కాకుండా... కేవలం ప్రణయం చుట్టూనే సాగే కథలు కొన్ని వస్తుంటాయి. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి... వాళ్ల మధ్య ప్రేమ, ఎదురయ్యే సవాళ్లుగా సాగే కథలు. ఇలాంటివి నలుపు తెలుపుల కాలం మొదలుకొని ఇప్పటికీ తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయినా ఎప్పటికప్పుడు కొత్త రకమైన అనుభూతిని పంచుతుంటాయి. ప్రేమ నిత్య నూతనం అనడానికి తార్కాణం అదే. ఈ ఏడాది కూడా తెలుగు తెరపైకి బోలెడు రకాల కథలొచ్చాయి.
ప్రేమకథలు బోర్ కొట్టవు. ఎన్నొచ్చినా సరే... మరో సినిమాని చూడటానికి సిద్ధమవుతుంటాడు ప్రేక్షకుడు. చిన్న పెద్ద అనే తేడా కూడా ఉండదు. కుర్రకారు ‘ఇది మా కథే’ అనుకుంటారు, పెద్దవాళ్లు తమ జీవితాల్లోని ప్రేమని గుర్తు చేసుకుంటూ కనెక్ట్ అవుతుంటారు. పక్కాగా ఫీల్ పండితే చాలు... అవి విజయవంతమైనట్టే.
వాళ్లూ మనసుపడ్డారు
ప్రేమకథలనగానే కొత్తతరం... యువ కథానాయకులే గుర్తుకొస్తారు. వాళ్లతోనే ఎక్కువగా ఆ సినిమాలు రూపొందుతుంటాయి. కానీ ఈసారి అగ్ర తారలూ ప్రేమకథలపై మనసు పడ్డారు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్’ అందుకో ఉదాహరణ. ఇది ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. విధిని కూడా ప్రేమ జయించగలదంటూ నిరూపించిన చిత్రమిది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసినా.. ప్రేమ కథల్లో మాత్రం ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రభాస్, పూజా హెగ్డే జోడీ మధ్య కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని దోచాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘విరాటపర్వం’ మరో ప్రేమకథ. రవన్న, వెన్నెల మధ్య విప్లవం నేపథ్యంలో ప్రేమకథ సాగుతుంది. దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిభకి అద్దం పట్టిన చిత్రమిది. ఆయన ప్రేమనీ, ఉద్యమాన్నీ కలిపిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది.
పరిణయమే ప్రధానంగా..
నాగచైతన్య ‘థ్యాంక్యూ’, సుధీర్బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో ప్రేమే ప్రధాన ఆకర్షణ. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ‘థ్యాంక్యూ’ ఓ యువకుడి జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందిన చిత్రమిది. తన గతాన్ని మళ్లీ ఎలా నెమరేసుకున్నాడు? తన జీవితాన్ని మలుపు తిప్పిన వాళ్లని కలుసుకుని వాళ్లకి ఎలా కృతజ్ఞతలు చెప్పాడన్నది ఈ కథలో కీలకం. ప్రేమ ఇతివృత్తం ఈ చిత్రానికి కీలకం. సుధీర్బాబు కథానాయకుడిగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఓ కమర్షియల్ దర్శకుడి చుట్టూ సాగే కథ. ఇందులోనూ ప్రేమ కీలకం. ఈ ఏడాది చివరి పేజీలో కనిపించిన మరో ప్రేమకథ ‘18 పేజెస్’. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సామాజిక మాధ్యమాలు లేని, ప్రేమలేఖలు రాసుకున్న కాలాన్ని గుర్తు చేసిన ప్రేమకథ ఇది. మంచి ఫీల్తో ఓ మంచి ప్రయత్నం అనిపించుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో...
యుద్ధంతో రాసిన ప్రేమకథగా ‘సీతారామం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రమిది. ఈ ఏడాది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రేమకథ కూడా ఇదే. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ నిర్మించింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. సైన్యంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ రామ్, ఆయనకి లేఖ రాసిన సీతామహాలక్ష్మి చుట్టూ సాగే ప్రేమకథ ఇది. మొదట దక్షిణాదిలో, ఆ తర్వాత హిందీలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268