Jamuna: మీరజాలగలడా.. నా యానతి
పాటల్లో చిరుకోపంతో మూతి విరుపులు ప్రదర్శించడంలో, పన్ను మీద పన్ను కనిపించేలా అందంగా నవ్వడంలో తనకు తనే సాటి జమున (Jamuna). అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్లతో మొదలై హీరో కృష్ణ, శోభన్బాబుల దాకా ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్లో జమున చక్కటి అభినయం కనబరచి ఆ పాటలను ఇప్పటికీ గుర్తుండేలా చేశారు.
పాటల్లో చిరుకోపంతో మూతి విరుపులు ప్రదర్శించడంలో, పన్ను మీద పన్ను కనిపించేలా అందంగా నవ్వడంలో తనకు తనే సాటి జమున (Jamuna). అగ్రనటులు ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్(ANR)లతో మొదలై హీరో కృష్ణ, శోభన్బాబుల దాకా ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్లో జమున చక్కటి అభినయం కనబరచి ఆ పాటలను ఇప్పటికీ గుర్తుండేలా చేశారు.
సత్యభామగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన జమున నటించిన ‘లేత మనసులు’ సినిమాలోని ‘హల్లో మేడం.. సత్యభామా! పైన కోపం, లోన ప్రేమ’ పాట పెద్ద హిట్ అయ్యింది.
* ఎన్టీఆర్తో చేసిన ‘నీ మది చల్లగా.. స్వామీ నిదురపో’ (ధనమా? దైవమా?), ‘మెరిసే మేఘమాలికా! ఉరుములు చాలు చాలిక’ (దీక్ష), ‘బృందావనమది అందరిదీ.. గోవిందుడు అందరివాడేలే’ (మిస్సమ్మ), ‘నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను’ (మంగమ్మశపథం) లాంటి పాటలు నేటికీ అలరిస్తాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన తొలిచిత్రం ‘రాముడు-భీముడు’లోని ‘తెలిసిందిలే.. తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే’ పాట ప్రేక్షకాదరణ పొందింది. ఇంకా ‘తోటలో నా రాజు తొంగిచూసెను నాడు’ (ఏకవీర), ‘పచ్చనిచెట్టూ ఒకటీ.. వెచ్చని చిలుకలు రెండూ’ (రాము) లాంటి గీతాలు మనసుకు హాయినిస్తాయి. ‘గులేబకావళి కథ’లో ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ!’ పాటలో ఎన్టీఆర్, జమునల నటన, అందచందాలు పోటాపోటీగా ఉంటాయి. ‘శ్రీకృష్ణ తులాభారం’లో ప్రియ నాథుడిపై ఆధిపత్యం చూపుతూ ‘మీరజాలగలడా.. నా యానతి’ అంటూ సాగే పాట జమునకు సిగ్నేచర్ సాంగ్గా నిలిచింది.
* ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ పాట ఏఎన్నాఆర్, జమునల చిత్రం ‘పూజాఫలం’కు ఆయువుపట్టుగా చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషనులో ‘ప్రేమయాత్రలకు బృందావనమూ, నందనవనమూ ఏలనో’ (గుండమ్మకథ), ‘నిలువవే వాలుకనులదానా’ (ఇల్లరికం), ‘గౌరమ్మా! నీ మొగుడెవరమ్మా!’ (మూగమనసులు), ‘బులిబులి ఎర్రని బుగ్గలదానా.. చెంపకు చారెడు కన్నులదానా’ (శ్రీమంతుడు) లాంటి ఎన్నో సూపర్హిట్ పాటలు వచ్చాయి. ‘మూగనోము’ చిత్రంలోని ‘ఈవేళ నాలో ఎందుకో ఆశలు’ పాట ఎవర్గ్రీన్ హిట్.
* కృష్ణతో కలిసి నటించిన చిత్రాల్లోనూ ‘చందమామ రమ్మంది చూడు’ (అమాయకుడు), ‘అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది’ (ఉండమ్మా! బొట్టు పెడతా), ‘మనసా! కవ్వించకే నన్నిలా’ (పండంటికాపురం) లాంటి చక్కటి పాటల్లో జమున గుర్తుండిపోతారు. ‘బొబ్బిలియుద్ధం’లో ‘అందాల రాణివే! నీవెంత జాణవే’ పాటలో జమున హావభావాలు చూసి తీరాల్సిందే. శోభన్బాబుతో జంటగా నటించిన చిత్రాల్లో ‘నీకున్నది నేనని.. నాకున్నది నీవని’ (తహసిల్దారుగారి అమ్మాయి) చెప్పుకోదగ్గ పాట.
* ఆధ్యాత్మిక గీతాల్లో తన్మయత్వంతో నటించేవారు జమున. ‘నీవుండేదా కొండపై నా స్వామీ! నేనుండేదీ నేలపై’ (భాగ్యరేఖ), ‘హిమగిరి మందిరా!.. గిరిజా సుందరా!’ (సతీ అనసూయ), ‘శరణన్నవారిని కరుణించే తిరుమలవాసా!’ (పవిత్ర హృదయాలు) లాంటి పాటలు ఆ కోవకు చెందినవే. పది కాలాలపాటు దాచుకోదగిన పాటల సత్యభామగా తెలుగు శ్రోతల హృదయాల్లో జమున నిలిచిపోతారు.
* ‘గోదారి గట్టుంది.. గట్టు మీన సెట్టుంది’ అంటూ ‘మూగమనసులు’లో జమున చేసిన అల్లరి మరచిపోలేము. జమున, హరనాథ్ జంటకు ఆరోజుల్లో గొప్ప ఆదరణ ఉండేది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల్లోని ‘అందాల ఓ చిలుకా!.. అందుకో నా లేఖ’ (లేత మనసులు), ‘నా మాట నమ్మితివేల’ (నాదీ ఆడజన్మే) పాటలు సూపర్హిట్ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు (Latest News)
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె