Chiranjeevi: రామ్చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది
‘వాల్తేరు వీరయ్య’ విజయం సాధిస్తుందని అనుకున్నాం కానీ, నాన్ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల స్థాయికి వెళ్తుందని అసలు ఊహించలేదు.
- చిరంజీవి
‘‘వాల్తేరు వీరయ్య’ విజయం సాధిస్తుందని అనుకున్నాం కానీ, నాన్ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల స్థాయికి వెళ్తుందని అసలు ఊహించలేదు. ఇదంతా ప్రేక్షకుల ఆదరణ వల్లే సాధ్యమైంది. ఇదేమీ ఆషామాషీ విజయం కాదు. ఇప్పటి వరకు దాదాపు రూ.250కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటేనే ఇదెలాంటి విజయమో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు చిరంజీవి. ఆయన.. రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ (కె.ఎస్.రవీంద్ర) తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే హన్ముకొండలో శనివారం రాత్రి ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో సక్సెస్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీనే. ఆయన తండ్రి తనకు నాపై ఉన్న ప్రేమను ఎలా నూరిపోశాడో.. ఈ చిత్రంతో చూపించాడు. ఈ సినిమాతో బాబీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తను ఈ చిత్రం తెరకెక్కించిన తీరు చూసి నేనే తనకు అభిమానినైపోయా. రవితేజను చూస్తే నాకు మరో పవన్ కల్యాణ్లా కనిపిస్తాడు. అందుకే తనపై నాకంత సోదరభావం ఉంటుంది. సినిమాలో తన పాత్ర చనిపోయే సన్నివేశాన్ని పవన్ను ఊహించుకొని చేశా. అందుకే ఆ సన్నివేశం అంత భావోద్వేగభరితంగా వచ్చింది. ‘రంగస్థలం’ చూస్తే అందులో రామ్చరణ్ ఎక్కడా కనిపించడు. చిట్టిబాబు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతుంటారు. చరణ్కు ఇప్పటికీ జాతీయ అవార్డులు రాకపోవచ్చు కానీ, ప్రతి ఒక్కరూ ఆ చిట్టిబాబు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారంటే దాని ప్రభావమెంతో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని జాతీయ అవార్డులొస్తే దానికి దీటుగా ఉంటుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ విశ్వరూపం చూపించాడు. అలాగే ఎన్టీఆర్ కూడా. వీళ్లూ.. కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాజమౌళి అందరూ కలిసి చేసిన ‘నాటు నాటు’ పాట ఈరోజున గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడమే కాక.. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్లిందంటే ఇంత కంటే గర్వకారణం మన తెలుగు వాళ్లకు ఏముంటుంది. నిజంగా చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా అనిపిస్తోంది. దేశానికి గర్వకారణమైన విషయమిది’’ అన్నారు.
* తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి కుటుంబంతో నాకు 30ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఆయన్ని, రామ్చరణ్ను కోరేది ఒకటే.. వరంగల్లో ఒక స్టూడియో పెట్టాలి. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అన్నారు.
* దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మా చిత్ర బృందం తరపున ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ చిత్రం విజయం సాధించాక ఇదెన్ని వందల కోట్లు సాధిస్తుందో నేను ఊహించలేదు. కానీ, ఇరవై రోజుల ముందే చిరంజీవి ఇచ్చిన జడ్జిమెంట్తో ఇదెంత బ్లాక్బస్టర్ హిట్ అవుతుందో అర్థమైపోయింది. మా నాన్న కాలం చేయడానికి నాలుగు నెలల ముందు చిరంజీవి ఆయన్ని ఇంటికి పిలిపించారు. ఈరోజు సాధించిన ఫలితాన్ని ఆరోజే ఊహించి నాన్నకు చెప్పి, ఆయన్ని సంతృప్తిగా పంపించారు. నిజానికి అప్పటికి 30శాతం చిత్రీకరణే పూర్తయింది. నేనిప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాను. కానీ, ఈ చిత్ర విజయంతో అందుకుంటున్న గొప్ప గౌరవాన్ని ఎప్పుడూ పొందలేద’’న్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ యెర్నేని, రవిశంకర్, బివిఎస్ రవి, కోన వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.
* హీరో రామ్చరణ్ మాట్లాడుతూ.. ‘‘మైత్రీ మూవీస్ సంస్థ నాకు ‘రంగస్థలం’ లాంటి అద్భుతమైన విజయాన్నిచ్చింది. ఇప్పుడు నాన్నకు ‘వాల్తేరు వీరయ్య’లాంటి మర్చిపోలేని విజయాన్ని అందించింది. బాబీ ప్రతి ఫ్రేమ్ను చెక్కినట్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు. అంత అద్భుతంగా ఉంది. మా నాన్న నాకు తమ్ముడిలా కనిపించారు. ఏ ముహూర్తాన పూనకాలు లోడింగ్ అని పెట్టారో కానీ.. వసూళ్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. రవితేజతో ఓ సీరియస్ పాత్ర చేయించి.. దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసేలా చేశారు బాబీ. సినిమా పూర్తయ్యాక కూడా రవితేజని ఇంకా చూడాలనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతమందించారు. ఇంత మధురమైన విజయాన్ని అందించిన చిత్ర బృందం మొత్తానికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. నాన్న చాలా సౌమ్యంగా ఉంటారని అందరూ అంటుంటారు. ఆయన అలా ఉన్నారు కాబట్టే ఈరోజున ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. నిజంగా ఆయన కొంచెం బిగించి.. కాస్త గట్టిగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఇతరులకు తెలియదు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే.. ఆయన మౌనంగా ఉంటారేమో కానీ, వెనకున్న మేము మౌనంగా ఉండం. ఇది మేము చాలా సౌమ్యంగా చెబుతున్న మాట’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ