హిట్ మీద హిట్టు
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ చాలు.. రాత్రికి రాత్రే తారల జాతకం మారిపోవడానికి. వాళ్లు అగ్రపథంలోకి దూసుకెళ్లడానికి.
కొనసాగుతున్న హీరోల జైత్రయాత్ర
అంచనాలు పెంచుతున్న కొత్త చిత్రాలు
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ చాలు.. రాత్రికి రాత్రే తారల జాతకం మారిపోవడానికి. వాళ్లు అగ్రపథంలోకి దూసుకెళ్లడానికి. అలాంటిది.. ఈ మధ్యకాలంలో మన టాప్ హీరోల నుంచి యువ కథానాయకుల దాకా.. కొందరు వరుస విజయాలతో జైత్రయాత్ర కొసాగిస్తున్నారు. దానికోసం వాళ్లు పడుతున్న కష్టం తక్కువేం కాదు. ఆచితూచి కథలు ఎంపిక చేసుకోవడం.. ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఆలస్యమైనా ఎదురుచూడటం.. అన్నీ కుదిరాకే ముహూర్తం పెట్టేసి రంగంలోకి దిగడం.. వాళ్లు చేస్తున్న పని. అలా విజయాలతో ప్రయాణం చేస్తూ... కథల ఎంపికపై ప్రేక్షకుల్లో నమ్మకాల్ని పెంచిన కథానాయకులు ఇప్పుడు తెలుగులో చాలామందే కనిపిస్తున్నారు. వాళ్ల నుంచి రాబోయే చిత్రాలు సైతం అంచనాల్ని అమాంతం పెంచేస్తున్నాయి.
కొన్ని సినిమాలు అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్నీ మెప్పించి వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. కొన్నేమో అభిమానుల్ని మాత్రమే మెప్పించి వసూళ్లు సాధిస్తుంటాయి. మరికొన్నేమో విమర్శకుల్ని మాత్రమే మెప్పించి, వసూళ్లతో సంబంధం లేకుండా విజయాలుగా నమోదవుతుంటాయి. మహేష్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’ సినిమాలతో వసూళ్ల వర్షం కురిపించారు. ఈ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర విజయాల్ని నమోదు చేశాయి. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు మహేష్. ‘గాడ్ఫాదర్’తో చిరంజీవి విజయాల బాట ఎక్కారు. ఆ చిత్రం వసూళ్ల కోణంలో కంటే.. విమర్శకుల్ని మెప్పించిన సినిమాగా నిలిచింది. గాఢతతో కూడిన చిరంజీవి నటన ఎక్కువగా మెప్పించింది. ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి ఆయన కామిక్ టైమింగ్ చూపించి పాత సినిమాల్లో చిరంజీవిని గుర్తు చేశారు. అలా వరుస విజయాలతో కొనసాగుతూ... ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తూ మరిన్ని అంచనాల్ని పెంచుతున్నారు.
* ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు బాలకృష్ణ. దీంతో ఇప్పుడు ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న సినిమాతో అంచనాలు భారీగా పెరిగాయి. రవితేజ కూడా ‘ధమాకా’తో బాక్సాఫీసుని కళకళలాడించారు. తొలి వారంలోనే రూ.వంద కోట్ల వసూళ్లని సాధించిందా చిత్రం. ఆ వెంటనే ‘వాల్తేరు వీరయ్య’తోనూ సందడి చేసి వరుస విజయాల్లో భాగం అయ్యారు.
* రాశికంటే వాశి ముఖ్యమని భావిస్తూ... సినిమాలు చేయడంలో ఆలస్యమైనా విజయవంతంగా ప్రయాణం చేస్తున్న కథానాయకులు కొద్దిమంది ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచులు... నేటి సినిమాల స్థాయిని పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’తో విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, తర్వాత ‘పుష్ప: ది రైజ్’తో మరో హిట్ అందుకున్నారు. ఆ పరంపరని కొనసాగించడమే లక్ష్యంగా, మధ్యలో ఏడాదికిపైగా విరామం వచ్చినా మరో చిత్రం చేయకుండా ‘పుష్ప: ది రూల్’ కోసం రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’తో విజయాన్ని అందుకున్న అనంతరం, ‘ఆర్ఆర్ఆర్’పైనే దృష్టిపెట్టి మరోసారి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అందుకు దీటైన సినిమా చేయాలనే సంకల్పంతో, మధ్యలో విరామం వచ్చినా లెక్క చేయకుండా కొరటాల శివతో కలిసి రంగంలోకి దిగుతున్నారు. త్వరలోనే ఈ కలయికలో సినిమా పట్టాలెక్కనుంది. ‘వకీల్సాబ్’తో అలరించిన పవన్కల్యాణ్... ‘భీమ్లానాయక్’తోనూ అభిమానుల్ని మెప్పించారు. ఈ సినిమాల వసూళ్లపై రకరకాల అంశాలు ప్రభావం చూపించినా... పవన్ కల్యాణ్ కెరీర్లో మంచి సినిమాలుగా నమోదయ్యాయి. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ని పూర్తిచేసే పనిలో ఉన్న ఆయన ‘ఉస్తాద్ భగత్సింగ్’ సహా పలు కొత్త చిత్రాలకి పచ్చజెండా ఊపారు.
* యువ కథానాయకులు కూడా వరుస విజయాలతో జోరు ప్రదర్శిస్తున్నారు. అడివి శేష్ ‘క్షణం’ మొదలుకొని తిరుగులేని రీతిలో విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ‘అమీతుమీ’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్2’... ఇలా వరుసగా విజయాలే ఆయనకి. ఇప్పుడు ‘గూఢచారి2’ పూర్తిచేసే పనిలో ఉన్నారు. మరో యువ కథానాయకుడు నిఖిల్ ‘అర్జున్ సురవరం’తో హిట్ ట్రాక్లోకి ఎక్కారు. ఆ తర్వాత వచ్చిన ‘కార్తికేయ2’ పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. ఇటీవలే వచ్చిన ‘18 పేజీస్’ కూడా యువతరాన్ని మెప్పించి ఆయన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’తో సత్తా చాటి, ఆ తర్వాత ‘జాతిరత్నాలు’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మహేష్ దర్శకత్వంలో అనుష్కకి జోడీగా ఓ సినిమా చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు