చెప్పాల్సింది వీళ్లే!
ఒకటి తర్వాత ఒకటంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు పోయాయి. మంచి కథ దొరికిందంటే చాలు.. చేతిలో ఎన్ని చిత్రాలున్నా మరో కబురు వినిపించేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు కథానాయకులు. అందుకే కొన్ని రోజులుగా చిత్రసీమలో కొత్త చిత్రాల సందడి గట్టిగా కనిపిస్తోంది.
కొత్త చిత్రాల కబుర్లు వినిపించేదెప్పుడు?
ఒకటి తర్వాత ఒకటంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు పోయాయి. మంచి కథ దొరికిందంటే చాలు.. చేతిలో ఎన్ని చిత్రాలున్నా మరో కబురు వినిపించేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు కథానాయకులు. అందుకే కొన్ని రోజులుగా చిత్రసీమలో కొత్త చిత్రాల సందడి గట్టిగా కనిపిస్తోంది. బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కల్యాణ్, ప్రభాస్ తదితర అగ్ర తారలంతా ఇప్పటికే కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టేశారు. మహేష్బాబు, రామ్చరణ్, ఎన్టీఆర్ తదితర స్టార్లు సైతం తదుపరి చిత్రాలపై స్పష్టత ఇచ్చేశారు. అందుకే ఆయా తారల అభిమానుల్లోనూ ఎలాంటి గందరగోళం లేదు. కానీ చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోల వైపు నుంచి ఎలాంటి స్పష్టమైన కబురు వినిపించడం లేదు. దీంతో వారి తర్వాతి చిత్రాల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
గతేడాది ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు నాగార్జున. వీటిలో ‘బంగార్రాజు’ ఓ మాదిరిగా ఆడినా ‘ది ఘోస్ట్’ అలరించలేకపోయింది. దీంతో కాస్త విరామం తీసుకొని మళ్లీ కథల ఎంపికపై దృష్టి సారించారు నాగ్. ఈసారి చేయనున్నది తన 100వ చిత్రం కావడంతో.. అది గుర్తుండిపోయేలా ఉండాలన్న ఉద్దేశంతో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగని ఇంకా కథలు సిద్ధం కాలేదని ఏమీ కాదు. దర్శకుడు మోహన్రాజాతో పాటు రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఇప్పటికే కథలు సిద్ధం చేసి, వినిపించారని సమాచారం. ఈ ఇద్దరితోనూ కలిసి పనిచేసేందుకు నాగార్జున సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అయితే వీరిలో ముందుగా ఎవరితో సినిమా చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. దీంతో ఇప్పుడా కబురు కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘గాడ్ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో వరుస విజయాలందుకొని ఫుల్ జోష్లో ఉన్నారు కథానాయకుడు చిరంజీవి. ఇప్పుడీ ఉత్సాహంలోనే ‘భోళా శంకర్’ను పూర్తి చేసేందుకు మెహర్ రమేష్తో కలిసి రంగంలోకి దిగారాయన. ఇది ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణకు చేరుకున్నప్పటికీ.. చిరు తదుపరి చిత్ర విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన కోసం అగ్ర దర్శకులు వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్ కథలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఈ జాబితాలోకి త్రినాథరావు నక్కిన కూడా చేరినట్లు ప్రచారం వినిపిస్తోంది. మరి వీళ్లలో ఎవరితో కలిసి చిరు ముందడుగు వేస్తారో వేచి చూడాలి.
‘పుష్ప’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొని.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు ‘పుష్ప2’తో మరోసారి సినీప్రియుల్ని మురిపించేందుకు సెట్స్పై ముస్తాబవుతున్నారు. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇప్పటికీ తేలలేదు. బోయపాటి శ్రీను, మురుగదాస్ లాంటి వారి పేర్లతో పాటు పలువురు బాలీవుడ్ దర్శకుల పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి. కానీ, బన్నీ మాత్రం ‘పుష్ప2’ విడుదల తర్వాతే కొత్త చిత్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘విరాటపర్వం’ విడుదలై ఆరు నెలలు పూర్తవుతున్నా రానా తదుపరి ప్రాజెక్ట్ ఇంకా తేలలేదు. ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్న ‘హిరణ్య కశ్యప’ కార్యరూపం దాల్చుతుందని భావించినా.. అదీ నెరవేరలేదు. ‘మానాడు’ తెలుగు రీమేక్లో నటిస్తారని వార్తలు వినిపించినా.. ఆఖరికి అది రవితేజ - సిద్ధు జొన్నలగడ్డ చేతికి చేరింది. దీంతో ఇప్పుడాయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక యువ కథానాయకుడు అఖిల్ తదుపరి చిత్ర విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం