క్లైమాక్స్ చిత్రీకరణలో గాయాలపాలయ్యా
‘‘సహజత్వం నిండిన చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాల్లోనే ఎక్కువ నటించాలి అనుకుంటున్నా’’ అన్నారు సూర్య వశిష్ఠ. ‘బుట్టబొమ్మ’తో తెరకు పరిచయమవుతున్న కొత్త కథానాయకుడాయన. శౌరి చంద్రశేఖర్ తెరకెక్కించారు.
‘‘సహజత్వం నిండిన చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాల్లోనే ఎక్కువ నటించాలి అనుకుంటున్నా’’ అన్నారు సూర్య వశిష్ఠ. ‘బుట్టబొమ్మ’తో తెరకు పరిచయమవుతున్న కొత్త కథానాయకుడాయన. శౌరి చంద్రశేఖర్ తెరకెక్కించారు. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సూర్య వశిష్ఠ.
‘‘ఇది హీరోగా నా తొలి చిత్రం. ఈ సినిమా మొదలు కావడానికి ముందే దీని మాతృకైన ‘కప్పెల’ చూశా. నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రంలో అవకాశం రాగానే చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో నేను మురళీ అనే ఆటోడ్రైవర్ పాత్రలో కనిపిస్తా. అది చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. మాతృకతో పోల్చితే ఈ సినిమా చాలా కొత్తగా.. తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. దర్శకుడు రమేష్ ప్రతి సన్నివేశంపైనా చాలా వర్క్ చేసేవారు. మంచి అవుట్పుట్ కోసం ఆయన ఎన్ని టేక్లైనా తీసుకుంటారు. దాంతో ముఖంలో ఆ అలసట కనిపించకుండా నటించాల్సి రావడం సవాల్గా అనిపించేది. ఈ చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో గాయాలపాలై ఆస్పత్రిలో చేరాను’’.
నాన్న కోరిక ఇది..
‘‘మా నాన్న పేరు సత్యం. 30ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. రాఘవేంద్రరావు, రాజమౌళి, త్రివిక్రమ్ల వద్ద కోడైరెక్టర్గా పని చేశారు. నన్ను నటుడిగా చూడాలనేది ఆయన కోరిక. నాకూ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. అయితే ముందుగా ప్రపంచాన్ని, మనుషుల్ని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువుల కోసం నన్ను అమెరికా పంపారు. ఐదేళ్లు అక్కడే ఉండి.. ఆ తర్వాత వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. నేను హీరోగానే చేయాలని ఏమీ అనుకోవట్లేదు. కథ, పాత్ర బాగుంటే... ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. రాజమౌళి, త్రివిక్రమ్ల సినిమాల్లో పని చేయాలని ఉంది’’.
ఏడాది బయటకు రాలేదు..
‘‘మా నాన్న ఓసారి ‘కప్పేల’ చిత్రం చూపించి.. ఇందులోని ఆటో డ్రైవర్ పాత్ర నీకు బాగుంటుందని చెప్పారు. తర్వాత ఆ చిత్ర రీమేక్ రైట్స్ను సితార వాళ్లు తీసుకోవడంతో.. ‘మా వాళ్లే తీసుకున్నార’ని నాన్న సంతోషించారు. కానీ, అప్పటికే ఆ పాత్రకు సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్ సేన్ లాంటి హీరోలు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆ అవకాశం రాదనుకున్నాం. ఈలోపు అనుకోకుండా నాన్న కొవిడ్తో కన్నుమూశారు. దీంతో ఆ బాధలో నేను ఏడాది పాటు బయటకు రాలేదు. తర్వాత ఓసారి త్రివిక్రమ్ను కలిస్తే.. ఆయన సూచన మేరకు సితారలో ఆడిషన్ ఇచ్చాను. అలా ‘బుట్టబొమ్మ’ చిత్రానికి ఎంపికయ్యాను’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!