విజయ్‌-పరశురామ్‌.. మరోసారి

కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ మరోసారి చేతులు కలిపారు. ‘గీత గోవిందం’ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు.

Published : 06 Feb 2023 01:26 IST

థానాయకుడు విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ మరోసారి చేతులు కలిపారు. ‘గీత గోవిందం’ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్‌, పరశురామ్‌, దిల్‌రాజు కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కొత్తదనం నిండిన ఓ వినూత్న కథాంశంతో.. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. విజయ్‌ ప్రస్తుతం శివ నిర్వాణతో ‘ఖుషి’ చేస్తుండగా.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని