సంక్షిప్త వార్తలు(6)
‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ అందం అనన్యా పాండే. ఇప్పుడు ఆమె నుంచి ఓ సైబర్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. నికిల్ అడ్వాణీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు.
సైబర్ కథలో అనన్య పాండే
‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ అందం అనన్యా పాండే. ఇప్పుడు ఆమె నుంచి ఓ సైబర్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. నికిల్ అడ్వాణీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి అనన్యా మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఈ కథ చెప్పగానే అందులో భాగం కావాలనిపించింది. ఆయన లాంటి మంచి దర్శకుడితో కెరీర్ తొలినాళ్లలోనే పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’అని చెప్పింది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ‘ఉడాన్’, ‘లూటెరా’, ఏకే వర్సెస్ ఏకే’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమాదిత్య. ‘‘నేటి ఆధునిక ప్రపంచానికి సరిగ్గా సరిపోయే కథ ఇది. ఇందులో సరికొత్త అనన్యను చూస్తారు’’అని చెప్పారు విక్రమాదిత్య.
భారతీయ సంగీత దర్శకుడికి గ్రామీ అవార్డు
భారతీయ సంగీత దర్శకుడు రికీ కేజ్ గ్రామీ అవార్డుని గెలుచుకున్నారు. ఆయన స్వరపరిచిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్కు గ్రామీ అవార్డు దక్కింది. ఆల్బమ్లో కేజ్తో కలిసి పనిచేసిన రాక్ లెజెండ్ స్టీవర్ట్ కోప్ల్యాండ్తో కలిసి ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరు 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్లో ఉత్తమ ఇమ్మెర్సివ్ ఆడియో ఆల్బమ్ విజేతగా గ్రామోఫోన్ ట్రోఫిని పొందారు. డివైన్ టైడ్స్ ఆల్బమ్లో మొత్తం 9 పాటలున్నాయి. కేజ్ 2015లో ‘విండ్స్ ఆఫ్ సంసార’కు మొదటి గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు. కోప్ల్యాండ్ ఐదు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. బెంగళూరుకి చెందిన రికీ ఈ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మూడోసారి ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుని భారతదేశానికి అంకితం ఇస్తున్నాను’’అని ట్వీట్ చేశారు రికీ. మూడుసార్లు గ్రామీ అవార్డు అందుకున్న భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
మరోసారి రుజువైంది
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సిందూరం’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా విజయోత్సవ వేడుకలో ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు ఇంకా మరెన్నో రావాలని నటుడు శివబాలాజీ మాట్లాడారు. కంటెంట్ ఉన్న సినిమాని ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారని నిర్మాత జంగా ప్రవీణ్ రెడ్డి అన్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా టీం తరపున ధన్యవాదాలు అని దర్శకుడు అన్నారు.
కవలలు హీరోలుగా సినిమా
కవలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా టి.శ్రీనివాస్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్లుక్ను సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఓ సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా మా పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో బద్రీ, కుప్పిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్.. తీవ్రవాదం కలిసి
విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అవంతిక, అర్చన గౌతమ్ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘ఐపిఎల్’. సురేష్ లంకలపల్లి తెరకెక్కించారు. బీరం శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ను, తీవ్రవాదాన్ని మిళితం చేసి దర్శకుడు సురేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోలూ ఎంతో కష్టపడ్డారు. అందరూ చూసి ఆశీర్వదించండి’’ అన్నారు దర్శకుడు.
జానపద ‘జాజిమొగులాలి’
అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన చిత్రం ‘రుద్రంగి’. నిర్మాత రసమయి బాలకిషన్ భారీ హంగులతో రసమయి ఫిలిమ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మోహన భోగరాజు పాడిన ‘జాజిమొగులాలి’ అంటూ సాగే జానపద గీతాన్ని విడుదల చేశారు. ఈ ప్రత్యేక గీతంలో దివి ఆకట్టుకునేలా డ్యాన్స్ చేసిందని చిత్రవర్గాలు తెలిపాయి. భాను మాస్టర్ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటకి అభినయ శ్రీనివాస్ సాహిత్యం అందించారు. నాఫల్రాజా స్వరాలు అందించిన ఈ గీతం తెలంగాణ యాసలో సాగనుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్దాస్, కాలకేయ ప్రభాకర్, తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్ఫ్లిక్స్లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!