Balakrishna: సినీ వారసత్వాన్ని కొనసాగించడం పెద్ద బాధ్యత
‘‘సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమన్నది చాలా పెద్ద బాధ్యత. దాన్ని మోయాలంటే ఎంతో రాటుదేలాలి.
బాలకృష్ణ
‘‘సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమన్నది చాలా పెద్ద బాధ్యత. దాన్ని మోయాలంటే ఎంతో రాటుదేలాలి. ఆ వారసత్వాన్ని ఓ బాధ్యతగా ముందుకు తీసుకెళ్తూనే నటుడిగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పుడే ఆ నట జీవితానికి ఓ అర్థం ఉంటుంది’’ అన్నారు కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). ఆయన మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘వేద’ (Veda) విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శివ రాజ్కుమార్ (Shiva Rajkumar) హీరోగా హర్ష తెరకెక్కించిన చిత్రమిది. గీతా శివ రాజ్కుమార్ నిర్మించారు. ఘనవి లక్ష్మణ్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘శివ రాజ్కుమార్ నాకు సోదరుడు. ఆయన సొంత బ్యానర్లో తన భార్యను నిర్మాతగా పరిచయం చేస్తూ ఈ చిత్రం చేశారు. అందుకు ఆయన్ని అభినందించాలి. శివ చేసిన ‘మఫ్టీ’ చూశా. చాలా నచ్చింది. తను అందులో చేసిన పాత్రను చూసే ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) పాత్రను తీర్చిదిద్దాం. ఈ చిత్ర ట్రైలర్ చూశా. చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు సినిమాని అద్భుతంగా తీశారు. అర్జున్జన్య మంచి పాటలిచ్చారు. నాయికలు ఘనవి, అదితి చక్కటి నటనను కనబర్చారు. కన్నడలో లాగే తెలుగులోనూ ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు. హీరో శివ రాజ్కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా మంచి సినిమా. ఇందులో మంచి సందేశం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇప్పటికే కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు వారికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘యాక్షన్తో కూడిన భావోద్వేగభరితమైన చిత్రమిది. ఆద్యంతం మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది. కన్నడలో భారీ విజయాన్ని అందుకుంది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు హర్ష. ఈ కార్యక్రమంలో స్వామి, అదితి సాగర్, కృష్ణ, ఘనవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..