సంక్షిప్త వార్తలు(4)
బాలీవుడ్ నటి నుష్రత్ ‘ఛోరి-2’తో సాక్షిగా మళ్లీ రాబోతుంది. విశాల్ ఫ్యూరియా తెరకెక్కించిన ‘ఛోరి’ చిత్రం 2021 నవంబరులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రెండో ‘ఛోరీ’ పూర్తి
బాలీవుడ్ నటి నుష్రత్ ‘ఛోరి-2’తో సాక్షిగా మళ్లీ రాబోతుంది. విశాల్ ఫ్యూరియా తెరకెక్కించిన ‘ఛోరి’ చిత్రం 2021 నవంబరులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ‘ఛోరి-2’ రాబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తియ్యింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రంలో సాక్షి కథ మొదటి భాగంలో ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి మళ్లీ మొదలవుతుంది.
పందిరి మంచం కథతో..
ఈవీ గణేష్బాబు హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కట్టిల్’. సృష్టి డాంగే, కన్నిక కథానాయికలు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి, అనేక అవార్డులు అందుకున్న ఈ సినిమా ‘పందిరి మంచం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ‘‘కోవెలలో..’’ గీతాన్ని దర్శకుడు మోహన్రాజా విడుదల చేశారు.
యుముడికి సోదరుడు
జై రమేష్, శ్రీదేవి, రుక్మిణి, భానుచందర్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ రాజ్ తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ ధర్మ’. బ్రదర్ ఆఫ్ యమ.. అన్నది ఉపశీర్షిక. రమేష్ ఆర్.కె నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో బుధవారం విడుదల చేశారు. అనంతరం నిర్మాత రమేష్ మాట్లాడుతూ.. ‘‘పోలీస్ బ్యాక్డ్రాప్లో మంచి కథ చెప్పమని దర్శకుడ్ని అడిగాను. నా భావాలకు అనుగుణంగా మంచి సన్నివేశాలు, పాటలు, ఫైట్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా పూర్తి చేశారు. ఇందులో వినోదానికి, రొమాన్స్కు మంచి ప్రాధాన్యత ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, బాబ్జీ, కోట శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
మదిని హత్తుకునే ‘అల్లంత దూరాన’
విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వల తెరకెక్కించారు. ఎన్.చంద్రమోహనరెడ్డి నిర్మాత. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. నటుడు అలీ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం నిర్మాత చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఓ మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించాలన్న తపనతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. ‘‘కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడూ మెచ్చేలా ఉంటుందీ చిత్రం. ఇందులో మంచి సీనియర్ ఆరిస్టులున్నారు’’ అన్నారు దర్శకుడు చలపతి. ఈ చిత్ర నాయకానాయికలు మాట్లాడుతూ.. ‘‘మనసుల్ని హత్తుకునే సినిమా ఇది. రధన్ సంగీతం, కల్యాణ్ ఛాయాగ్రహణం అలరిస్తాయ’’న్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ రావు, రాంబాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ