Shiva Rajkumar: పాన్ ఇండియా స్టారంటే అన్ని భాషలు మాట్లాడాలి!
‘‘వినోదం, యాక్షన్తో పాటు మంచి సందేశం ఉన్న చిత్రం ‘వేద’. ఇది కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు శివ రాజ్కుమార్ (Shiva Rajkumar).
‘‘వినోదం, యాక్షన్తో పాటు మంచి సందేశం ఉన్న చిత్రం ‘వేద’. ఇది కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు శివ రాజ్కుమార్ (Shiva rajkumar). రాజ్కుమార్ నట వారసుడిగా తెరపైకి కాలుమోపి.. ఐదు దశాబ్దాలుగా కన్నడ ప్రేక్షకులతో పాటు భారతీయ సినీప్రియుల్ని అలరిస్తున్న కథానాయకుడాయన. ఇప్పుడు ‘వేద’(Veda)గా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇది ఆయనకు 125వ చిత్రం. హర్ష తెరకెక్కించారు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు శివ రాజ్కుమార్.
తెలుగు చిత్రపరిశ్రమ, ప్రేక్షకులతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
‘‘నాకు ఈ పరిశ్రమతో.. ఇక్కడి ప్రేక్షకులతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన నా ‘కిల్లింగ్ వీరప్పన్’తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. అలాగే బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో నటించా. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టాక అందులో చిత్రీకరణ జరుపుకున్న తొలి కన్నడ చిత్రం నాదే. ఇక్కడి ‘ఉలవచారు బిర్యానీ’ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్.. ఇలా నాకెంతో మంది మంచి స్నేహితులున్నారు. వాళ్లు నన్నెంతో ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడీ ‘వేద’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది’’.
ఈ ‘వేద’ కథేంటి? మీ పాత్ర ఎలా ఉండనుంది?
‘‘మంచి సందేశంతో కూడిన పక్కా వాణిజ్య చిత్రమిది. కుటుంబంలో సమస్యలొచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది ఈ సినిమాలో చూపించాం. ప్రేమ, జీవితం, సంతోషం, నమ్మకం.. ఈ నాలుగంశాలేే వేద జీవితంలో కనిపిస్తాయి. కుటుంబ ప్రేక్షకులకు ఈ కథతో చక్కగా కనెక్ట్ అవుతారు’’.
ట్రైలర్ చూస్తుంటే.. సినిమాలో యాక్షన్కు ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది..
‘‘ఇదేమీ పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. ఇందులో యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రంలో ఆడవాళ్లు ఫైట్స్ చేస్తారు. అదెందుకనేది తెరపై చూసినప్పుడు అర్థమవుతుంది. సమాజంలో ఆడవాళ్లు ఎప్పట్నుంచో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లు బలంగా నిలబడాలి. వారిని మనం ప్రోత్సహించాలి. ఈ అంశాలన్నింటినీ దీంట్లో చర్చించాం’’.
ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఎందుకలా?
‘‘ఎంతో ఆసక్తికరమైన పాత్రలొస్తున్నాయి. అందుకే చేస్తున్నా. రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశమొచ్చిందంటే ఎవరైనా కాదంటారా. అందుకే ‘జైలర్’లో అతిథి పాత్ర చేస్తున్నా. అది చిన్న పాత్రైనా చాలా బాగుంటుంది. నాకు ధనుష్ అంటే ఇష్టం. తన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే అది చేస్తున్నా. తెలుగులోనూ రెండు మూడు కథలు విన్నా. ఏదీ ఖరారు కాలేదు. బాలకృష్ణ కూడా మనిద్దరం కలిసి చేద్దామన్నారు. చూద్దాం ఏమవుతుందో’’.
ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేశారు. ఇంకా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
‘‘అన్నమయ్య’ తరహా భక్తి ప్రధాన చిత్రాలు చేయాలని ఉంది. ప్రస్తుతం నేను ‘అశ్వథామ’, ‘ఘోస్ట్’, ‘45’, ‘కరటక ధమనక’ తదితర చిత్రాలు చేస్తున్నా’’.
రెండేళ్లుగా కన్నడ చిత్రసీమ ఎంతో ఖ్యాతి సాధించుకుంది. మీకెలా అనిపిస్తోంది?
‘‘కన్నడ, తెలుగు.. రెండు చిత్రసీమలూ మంచి స్థాయికి వెళ్లాయి. చాలా సంతోషంగా ఉంది. పక్కా ప్రణాళికలతోనే ఇక్కడ ఇంత మంచి సినిమాలు చేయగలుగుతున్నారు. ఇలా గట్టిగా ప్రయత్నించినప్పుడే లక్ష్యాలు చేరుకోగలుగుతాం. నా దృష్టిలో పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను తెలుగులోనూ మాట్లాడుతాను కానీ, అంత అనర్గళంగా రాదు. కాస్త సమయం తీసుకొని పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు