Tollywood: కార్తితో పరశురామ్‌ సినిమా?

‘సర్కారు వారి పాట’ తర్వాత కొత్త కబురు వినిపించడానికి చాలా సమయమే తీసుకున్నారు దర్శకుడు పరశురామ్‌.

Updated : 18 Feb 2023 05:08 IST

‘సర్కారు వారి పాట’ తర్వాత కొత్త కబురు వినిపించడానికి చాలా సమయమే తీసుకున్నారు దర్శకుడు పరశురామ్‌. ఎట్టకేలకు విజయ్‌ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇది త్వరలో పట్టాలెక్కనుంది. కాగా, ఈలోపే ఆయన మరో చిత్రాన్ని ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అది కథానాయకుడు కార్తితో చేయనున్నారని సమాచారం. ‘ఊపిరి’ తర్వాత కార్తి తెలుగులో నేరుగా మరో సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా పలు తెలుగు కథలు విన్నా.. ఏదీ ఆయనకు నచ్చలేదట. ఎట్టకేలకు పరశురామ్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. విజయ్‌ దేవరకొండ చిత్రం పూర్తయ్యాకే ఇది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈలోగా కార్తి ‘జపాన్‌’, ‘ఖైదీ2’ చిత్రాల్ని పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని