ఒక హత్య.. ఓ పెద్ద కుంభకోణం!
‘‘ఓ హత్య చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందించిన చిత్రమే ‘సీఎస్ఐ సనాతన్’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. ఆఖర్లో ఓ మంచి సందేశాన్ని ఇవ్వనున్నాం’’ అన్నారు అజయ్ శ్రీనివాస్.
‘‘ఓ హత్య చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందించిన చిత్రమే ‘సీఎస్ఐ సనాతన్’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. ఆఖర్లో ఓ మంచి సందేశాన్ని ఇవ్వనున్నాం’’ అన్నారు అజయ్ శ్రీనివాస్. ఆయన నిర్మాణంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రమే ‘సీఎస్ఐ సనాతన్’. శివశంకర్దేవ్ తెరకెక్కించారు. మిషా నారంగ్ కథానాయిక. ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు నిర్మాత శ్రీనివాస్.
‘‘ఇది నిర్మాతగా నా తొలి సినిమా. ప్రస్తుతం థ్రిల్లర్ చిత్రాల హవా నడుస్తోంది. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులూ ఈ తరహా చిత్రాల్ని ఇష్టపడుతున్నారు. అందుకే నా తొలి సినిమాని ఈ జానర్లోనే చేయాలని నిర్ణయించుకున్నా. ఒక కంపెనీ అధినేత హత్య నేపథ్యంగా సాగే కథ ఇది. ఇందులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ల క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా చూపించాం. దీంతో పాటు ప్రస్తుతం దేశంలో చాలామందిని సర్ప్రైజ్ చేసిన ఓ పెద్ద కుంభకోణానికి సంబంధించిన అంశాల్ని చూపించాం. దానికి ప్రేక్షకులంతా బాగా కనెక్ట్ అవుతారు’’.
* ‘‘కథ విన్నప్పుడే దీనికి ఆది సాయికుమార్ను హీరోగా అనుకున్నా. ఎందుకంటే తన లుక్, బాడీలాంగ్వేజీ కథకు సరిగ్గా సరిపోతాయి. ఇందులో ఆయన పాత్ర పేరు సనాతన్. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్గా కనిపిస్తాడు. ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. నేపథ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. విరామ సన్నివేశాలు సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నాం. అలాగే చేతబడి, మహిళల అక్రమ రవాణా నేపథ్యాల్లో రెండు సినిమాలు చేస్తున్నాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి