ఆ రోజే నేను నటుడిగా మళ్లీ పుట్టా!
‘‘తెలుగు సినిమా అగ్రస్థానంలో ఉంది. నటులందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఆ స్థానాన్ని అలా నిలబెట్టాల’’ని పిలుపునిచ్చారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్.
‘దాస్ కా ధమ్కీ’ వేడుకలో ఎన్టీఆర్
‘‘తెలుగు సినిమా అగ్రస్థానంలో ఉంది. నటులందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఆ స్థానాన్ని అలా నిలబెట్టాల’’ని పిలుపునిచ్చారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్. ఆయన శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘దాస్ కా ధమ్కీ’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. నివేతా పేతురాజ్ కథానాయిక. కరాటే రాజు నిర్మాత. ఉగాది సందర్భంగా ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఎన్టీఆర్ ప్రసంగించారు. ప్రపంచ పటంలో ‘ఆర్ఆర్ఆర్’ నిలబడిందంటే, ఆస్కార్ చేజిక్కించుకుందంటే మేము, మా బృందం ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమ అంతే కారణం. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ కూడా అంతే కారణం. ఆ సినిమాకి పనిచేసిన మేం కాదు పురస్కారం సొంతం చేసుకున్నది. ప్రేక్షకులకు బదులు మేం అక్కడున్నాం. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ కాకుండా... ఇద్దరు భారతీయులు, ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు. ఆ వేదిక మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. మీరు టీవీల్లో చూసి ఎంత ఉత్సాహం పొందారో, నేను రెండు కళ్లతో చూస్తూ అంత ఆస్వాదించా. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారత సినిమాలు మరింత ముందుకు సాగాలని దేవుడిని కోరుకుంటున్నా. విష్వక్ సేన్ వేదికపై మాట్లాడినట్టు నేనెప్పటికీ మాట్లాడలేను. అంత ఉత్సాహం తనలో ఉంటుంది. ఎప్పట్నుంచో నాపైన ఉన్న బాధ్యతతో ఇక్కడికి వచ్చా. నాకు బాగా ఇష్టమైన సినిమాలు తక్కువగా ఉంటాయి. అందులో విష్వక్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చాలా ముఖ్యమైనది. అందులో విష్వక్, అభినవ్ నటనని చూస్తూ ఉండిపోతుంటా. ముఖ్యంగా విష్వక్ని. ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను. ఎంత కామెడీ పండిస్తాడో అంతే బాధని దిగమింగుకుని కనిపిస్తుంటాడు. ఒక కొత్త నటుడికి చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి అలాంటి పాత్రలు చేయాలంటే. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ, తనకి చాలా మంచి చేసింది. ఆ సినిమా తర్వాత ‘ఫలక్నామాదాస్’ చూశా. నటుడిగా తనెంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడో దర్శకుడిగా కూడా అంతే. చాలా బాగా చేశాడు. ‘పాగల్’ కూడా చేశాడు. తనొక ఛట్రంలోకి వెళ్లిపోతాడా అనుకున్నప్పుడు ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ చేశాడు. ఆ సినిమా చూసినప్పుడు షాక్ అయ్యా. ఇంతగా మారిపోయాడు అనిపించింది. నేను నటుడిగా అలా మారడానికి చాలా కాలం పట్టింది. నటుడిగా నేను ఆనందపడే సినిమాలు చేయాలని ఆలస్యంగా అనుకున్నా. ఆ రోజే ఈ వేదికపైనే మీరంతా కాలర్ దించుకోకుండా చేస్తానని చెప్పా. అందరికీ ఆ వాగ్ధానం చేసిన రోజే నేను నటుడిగా మళ్లీ పుట్టా. విష్వక్ ఎప్పుడూ ఏదో ఒకటి నిరూపించుకోవాలనే తపనతో కనిపిస్తుంటాడు. ఈ చిత్రం నిజంగా బ్లాక్బస్టర్ కావాలి. ఈ సినిమాతో తను ఘన విజయం సాధించి దర్శకత్వం చేయడం నిలిపేయాలని కోరుకుంటున్నా. బయట ఔత్సాహికులైన యువ దర్శకులు బోలెడు మంది ఉన్నారు. విష్వక్తోపాటు మాలాంటివాళ్లంతా ఆ దర్శకులకి అవకాశం ఇవ్వాలి. విష్వక్ నాతో మాట్లాడుతూ ‘ఉన్నదంతా పెట్టేశాను ఈ సినిమా కోసం’ అని చెప్పాడు. ఒక మంచి సినిమా చేయాలనే పిచ్చి తనకెంతగా ఉందో అప్పుడు అర్థమైంది. ఇలాంటి పిచ్చి ఉన్నవాళ్లే పరిశ్రమని ముందుకు తీసుకెళతారు. ఇలాంటివాళ్ల చిత్రాలు ఆడాలి, అప్పుడే మనం ముందుకు వెళతాం. మార్చి 22న విడుదలవుతుందీ చిత్రం. ఈ ఉగాది పండుగ రోజు విష్వక్కి నిజమైన పండుగ రావాలని మనసారా కోరుకుంటున్నా. తను ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఇది మొదటి మెట్టు కావాలి. నటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు. విష్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నాలో ఒక అభిమానిని చూసుకుని... నాకు ఇచ్చిన మాట కోసం వచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ వస్తున్నాడంటే కూడా చాలా మంది నమ్మలేదు. భారతదేశంలో ఉత్తమ నటుడు ఎవరంటే ఎన్టీఆర్ అని నేనెప్పుడో చెప్పా. 17 ఏళ్లకే తొడగొట్టారు ఎన్టీఆర్. ఉన్నదంతా పెట్టి నేను సొంతంగా నిర్మించిన చిత్రమిది. ‘వీడికి ఉన్నదంతా పోగొట్టుకుంటే వెక్కిరిద్దాం, నవ్వుదాం’ అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. దేవుడు ఇవన్నీ చూస్తుంటాడు కాబట్టే ఎన్టీఆర్ని పంపించారు. నాకు బ్లాక్ బస్టర్ మొదలైంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ బెజవాడ, రామ్ తాళ్లూరి, హను రాఘవపూడి, సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్, కళా దర్శకుడు రామాంజనేయులు, ఛాయాగ్రాహకుడు దినేష్, పృథ్వీ రాజ్, రవి, యశ్, కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, మంగ్లీ, మహేష్, హైపర్ ఆది, అమిత్ శర్మ, బి.వి.ఎస్.రవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర