Krishna Vamsi: రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి
‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (Ranga Marthanda) చేశాం.
- దర్శకుడు కృష్ణవంశీ
‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (rangamarthanda) చేశాం. కొన్ని సినిమాలకి అన్నీ కుదురుతాయి, కొన్నిసార్లు కుదరదు. ఈ సినిమాకి అనుకున్నవన్నీ పక్కాగా కుదిరాయి’’ అన్నారు కృష్ణవంశీ (Krishna Vamsi). ఆయన దర్శకత్వంలో ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలీపు మధు నిర్మాత. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మాస్ సినిమాల జోరు కొనసాగుతున్న సమయంలో ‘శంకరాభరణం’ వచ్చింది. ఈమధ్య ‘మహానటి’ వచ్చింది. అందరం అన్ని చిత్రాలూ బాగుండాలనే, ప్రేక్షకుల మెప్పు పొందాలనే తీస్తాం. ‘రంగమార్తాండ’ చూసినవాళ్లంతా బాగుందని చెప్పారు. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. విడుదల తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి అదే రకమైన స్పందన వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. మరాఠీలో ‘నటసామ్రాట్’ కథ ఎక్కువగా షేక్స్పియర్ నాటకాల చుట్టూ సాగుతుంది. మేం మన నాటకాలకి అన్వయిస్తూ స్క్రిప్ట్ని తీర్చిదిద్దాం. ప్రకాశ్రాజ్ ఆంగ్లం, సంస్కృతం, తెలుగు... ఏదైనా మాట్లాడతాడు. గొప్ప నటుడు తను. రాఘవరావు పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మానందం తన పాత్ర లుక్ కోసం ఏమీ తినకుండా, ఎన్ని టేక్లైనా ఓపికతో చేశారు. పెద్ద పెద్ద డైలాగ్స్ని ఆయన చెప్పారు. రమ్యకృష్ణ చేసిన పాత్ర కోసం మొదట వేరే నటుల్ని పరిశీలించాం. తను కూడా కొన్ని పేర్లు సూచించింది. ప్రతి సినిమాలోనూ పెద్ద పెద్దగా అరుస్తూ నటిస్తుంటావెందుకని నేను, మా అబ్బాయి రమ్యకృష్ణని అడుగుతుంటాం. కానీ ఇందులో కళ్లతోనే భావాలు పలికించే పాత్ర తనది. తన కళ్లు చాలా బాగుంటాయి. ఓరోజు ఈ పాత్రని నువ్వే ఎందుకు చేయకూడదని అడిగా. తను ఒప్పుకోవడంతోపాటు, ఆ పాత్రకి మేకప్, హెయిర్స్టైల్ తనే చేసుకుంది. తనపై క్లైమాక్స్లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నప్పుడు కంట్లో నీళ్లొచ్చాయి. వాటిని దాదాపు 36 గంటలపాటు తీశా’’ అన్నారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ‘‘కృష్ణవంశీ సర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అదే ప్రత్యేకం అనుకుంటే ఇందులో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం రావడం మరింత ఆనందాన్నిచ్చింది’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM