Rangamarthanda : జీవితాన్ని చూస్తున్నట్టుండే సినిమా ఇది
‘‘ఎవ్వరైనా సరే.. నేల విడిచి సాము చేయకూడదు. నేను సీరియస్గా నటించినా నవ్వే రోజులివి. ఒక హాస్యనటుడిగా ఆ పరిధిని దాటి నేను రాకూడదు.
‘‘ఎవ్వరైనా సరే.. నేల విడిచి సాము చేయకూడదు. నేను సీరియస్గా నటించినా నవ్వే రోజులివి. ఒక హాస్యనటుడిగా ఆ పరిధిని దాటి నేను రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకొక పాత్ర గురించి చెప్పినప్పుడు కచ్చితంగా ఇదొక అరుదైన అవకాశం అనుకున్నా. అదే నిజమైంది’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆయన, ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. కాలీపు మధు నిర్మాత. ఈ చిత్రం ఉగాది సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘కృష్ణవంశీ, ప్రకాశ్రాజ్ వచ్చి ఈ సినిమాలో మీరు నటించాలని అడిగినప్పుడు ఆశ్చర్యపోయా. మీరే చేయాల్సిన పాత్ర అన్నప్పుడు వెంటనే చేస్తానని చెప్పా. ఈ సినిమా చూస్తున్నప్పుడు జీవితాన్ని చూస్తున్నట్టే ఉంటుంది’’ అన్నారు. ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ ‘‘మరాఠీలో వచ్చిన ‘నటసామ్రాట్’ చూసినప్పుడు ఒక కళాకారుడి జీవితంలో ఉన్న ఓ బరువు నాకు అర్థమైంది. ఒక విధంగా తను ఈ సినిమాలో తన జీవితాన్నే చూపించాడు. బ్రహ్మానందం నటనని చూస్తున్నప్పుడు దగ్గర నుంచి ఒక విశ్వరూపాన్ని చూస్తున్న అనుభూతి కలిగింది. ఇలాంటి సినిమా అందరికీ కావాలి’’ అన్నారు. కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘ప్రకాశ్రాజ్లాంటి నటుడిని ‘నువ్వొక చెత్త నటుడివి’ అంటూ చెంపదెబ్బ కొట్టే పాత్రకి నటుడిని ఎంపిక చేయాలన్నప్పుడు మాకు బ్రహ్మానందం గుర్తొచ్చారు. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, ఇతర నటులు పాత్రల కోసం ప్రాణం పెట్టార’’న్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!