Tollywood: నడిపించే నాయికీ
మన సినిమా పోస్టర్కి ప్రధాన ఆకర్షణ కథానాయకుడే. వాళ్లని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. వసూళ్లు... రికార్డులపై ప్రభావం చూపించేది కథానాయకులే.
రాబోయే చిత్రాల్లో కీలకం కానున్న హీరోయిన్లు
మన సినిమా పోస్టర్కి ప్రధాన ఆకర్షణ కథానాయకుడే. వాళ్లని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. వసూళ్లు... రికార్డులపై ప్రభావం చూపించేది కథానాయకులే. ఎంత పెద్ద హీరో కనిపిస్తే... బాక్సాఫీస్ దగ్గర అంత ఘనమైన రికార్డులు నమోదవుతుంటాయి. అలాగని కథానాయికని తక్కువగా చూడలేం. అందమైన జోడీ... విజయవంతమైన జోడీ... ప్రత్యేకమైన జోడీ... అనే మాటల వెనక హీరోయిన్ ప్రభావం సుస్పష్టం. హీరోకి దీటైన పాత్రల్లోనూ... అప్పుడప్పుడూ నాయికా ప్రధానమైన కథల్లోనూ నటిస్తూ బాక్సాఫీస్ని ప్రభావితం చేస్తుంటారు. రానున్న కొన్ని సినిమాలకి కథానాయికలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అంచనాల్ని పెంచడంలో వాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
కీర్తిసురేష్, సమంత, ఐశ్వర్యరాయ్, త్రిష, అనుష్క... ఇలా అందగత్తెలంతా వరుసగా సందడి చేయనున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ కథానాయికల జోరు కనిపించనుంది. అయితే వీళ్లంతా నాయికా ప్రధానమైన కథలతోనే రావడం లేదు. ‘శాకుంతలం’తో సమంత మినహా మిగిలినవాళ్లంతా హీరోల సినిమాలతోనే ప్రభావం చూపిస్తున్నారు.
* అనుష్క ‘సైలెన్స్’ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ఆమె చాలా రోజుల తర్వాత యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో జట్టు కట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో నటించింది. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి నవీన్ పొలిశెట్టి ఎంత ఆకర్షణో... అనుష్క కూడా అంతే ఆకర్షణగా మారింది. ఒకప్పుడు నాయికా ప్రధానమైన సినిమాలు చేసిన అనుష్క... విరామం తర్వాత చేసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 30నే ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘దసరా’ విషయంలో నాని పోషించిన ధరణి పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో, కీర్తి సురేష్ పోషించిన వెన్నెల పాత్ర కూడా అంతే ప్రాచుర్యం పొందింది. ఈ కథకి ఆమె పాత్ర కీలకం అని చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ‘మహానటి’ తర్వాత అంతగా భావోద్వేగాల పరంగా నాకు కనెక్ట్ అయిన సినిమా అని కీర్తి కూడా ప్రత్యేకంగా చెబుతూ అంచనాలు పెంచుతోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘రావణాసుర’లో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ సినిమాకి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తున్నారు. మరి ఆయా పాత్రలతో సినిమాపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారనేది కీలకంగా మారింది.
* సినిమానంతా భుజాలపై మోసే కథానాయికలు చాలా అరుదు. అలాంటి అరుదైన కథానాయికల జాబితాలో సమంత ఒకరు. కొన్నేళ్లుగా దక్షిణాదిన నాయికా ప్రధానమైన కథలకి కేరాఫ్గా మారారు. ‘యశోద’ తర్వాత ఆమె మరోసారి తన చుట్టూ తిరిగే కథతో ‘శాకుంతలం’ చేశారు. కాళిదాసు రచన ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకావ్యంగా రూపొందిన ఈ సినిమాలో శకుంతలగా తన అందచందాలతోనూ, నటనతోనూ కట్టిపడేయనుంది సమంత. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాకి కూడా తారల గ్లామరే ప్రధాన ఆకర్షణ. హీరోలకి దీటుగా ఐశ్వర్యరాయ్, త్రిష పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తొలి భాగంలో కథల్ని మలుపు తిప్పే పాత్రల్లో నటించి ఈసారి మరిన్ని అంచనాల్ని పెంచుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?