Krishna Vamsi: ‘రంగమార్తాండ’ ఆ నైతిక స్థైర్యాన్ని అందించింది!
‘‘రంగమార్తాండ’ (Rangamarthanda) విజయం ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేయడానికి కావాల్సిన నైతిక స్థైర్యాన్ని అందించింద’’న్నారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi).
‘‘రంగమార్తాండ’ (Rangamarthanda) విజయం ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేయడానికి కావాల్సిన నైతిక స్థైర్యాన్ని అందించింద’’న్నారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi). మరాఠీలో విజయవంతమైన ‘నటసామ్రాట్’కు రీమేక్గా రూపొందిన చిత్రమిది. ప్రకాష్రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు కృష్ణవంశీ. ఆ విశేషాలివి..
‘‘ప్రకాష్ రాజ్ సలహాతో తొలిసారి ‘నటసామ్రాట్’ చిత్రం చూశా. అది చూసినప్పుడే భావోద్వేగాల్ని నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా. అందులోని ఫ్యామిలీ ఎమోషన్స్ నాకు అంత బాగా నచ్చాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో కుటుంబ బంధాల మధ్య దూరం పెరుగుతోంది. కాబట్టి ఇలాంటి తరుణంలో ఈ కథ చెబితే బాగుంటుందనిపించింది. ప్రకాష్ కూడా ఈ కథ నువ్వు డైరెక్ట్ చేస్తేనే బాగుంటుందని చెప్పడంతో ఈ చిత్రం భుజానికెత్తుకున్నా. మాతృకతతో పోల్చితే ఈ సినిమాలో చాలా మార్పులు చేశాం. ఫ్యామిలీ ఎమోషన్స్కు పెద్ద పీట వేశాం. తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పాం. సమాజంలోని అనేక సమస్యల్ని చర్చించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ ‘మా అమ్మ గుర్తొంచ్చింది. నాన్న గుర్తొచ్చారు’ అంటూ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది’’.
* ‘‘ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రను ‘నువ్వు చెత్త నటుడివి’ అని తిట్టాలన్నా.. చెంప దెబ్బ కొట్టాలన్నా ఆ స్థాయి ఉన్న నటుడు కావాలి. అలాగే ఆ పాత్ర ప్రేక్షకులకు ఓ మంచి సర్ప్రైజ్గా ఉండాలి. వీటన్నింటికీ న్యాయం చేయాలంటే నాకు ముందుగా మనసులో మెదిలిన రూపం బ్రహ్మానందమే. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ‘చక్రపాణి పాత్రను బ్రహ్మానందంతో చేయించాలనుకుంటున్నా’ అని ప్రకాష్తో చెప్పా. తను కూడా వెంటనే చాలా బాగుంటుందని ఒప్పుకున్నాడు. ఈ చిత్రంలో వచ్చే ఆస్పత్రి సీన్ను బ్రహ్మానందం మూడు నెలల పాటు బట్టీపట్టారు. ప్రకాష్ను చెంప దెబ్బ కొట్టే సీన్ చేసే సమయంలో ఆయన భోజనం కూడా మానేశారు. ఆ చక్రపాణి పాత్ర కోసం బ్రహ్మానందం అంత కష్టపడ్డారు. త్వరలో ‘అన్నం’ అనే సినిమా చేయనున్నా. అదొక విభిన్నమైన సినిమా. అదెప్పుడు సెట్స్పైకి వెళ్తుంది.. ఏ నిర్మాణ సంస్థలో ఉంటుందన్నది త్వరలో తెలియజేస్తా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.