నచ్చావులే.. నీ కొంటె వేషాలే చూశాకే!
‘‘నచ్చావులే నచ్చావులే.. ఏరోజు చూశానో ఆరోజే.. నచ్చావులే నచ్చావులే.. నీ కొంటె వేషాలే చూశాకే’’ అంటూ తను మనసు దోచిన అమ్మాయిపై ప్రేమ గీతం ఆలపిస్తున్నారు హీరో సాయిధరమ్ తేజ్.
‘‘నచ్చావులే నచ్చావులే.. ఏరోజు చూశానో ఆరోజే.. నచ్చావులే నచ్చావులే.. నీ కొంటె వేషాలే చూశాకే’’ అంటూ తను మనసు దోచిన అమ్మాయిపై ప్రేమ గీతం ఆలపిస్తున్నారు హీరో సాయిధరమ్ తేజ్. ఆయన.. సంయుక్తా మేనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘‘నచ్చావులే’’ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్ సాహిత్యమందించారు. కార్తీక్ ఆలపించారు. ‘‘1990లో జరిగే కథ ఇది. ఓ ప్రాంతంలో విచిత్రమైన సమస్యతో బాధపడుతున్న ప్రజల్ని కాపాడేందుకు కథానాయకుడు ఏం చేశాడన్నది కథాంశం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: శ్యామ్దత్ సైనుద్దీన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా