Allu Arjun: ప్రేమతో ఇరవై ఏళ్లు

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం ‘గంగోత్రి’ ప్రేక్షకుల ముందుకొచ్చి మంగళవారంతో ఇరవయ్యేళ్లు పూర్తయ్యాయి.

Updated : 29 Mar 2023 07:08 IST

ల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం ‘గంగోత్రి’ ప్రేక్షకుల ముందుకొచ్చి మంగళవారంతో ఇరవయ్యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్‌ చేశారు.  ‘‘చిత్ర పరిశ్రమలో ఇరవయ్యేళ్లు పూర్తయ్యాయి. నన్నంతా ప్రేమలో ముంచెత్తారు. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమే ఈ ప్రయాణానికి కారణం. పరిశ్రమకీ, నన్ను ఆరాధించేవాళ్లకి ఎప్పటికీ కృతజ్ఞుడిని’’ అంటూ ట్వీట్‌ చేశారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సుకుమార్‌ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటోని పంచుకుంటూ... ‘‘అల్లు అర్జున్‌ నుంచి స్టైలిష్‌ స్టార్‌గానూ, ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గాను ఎదిగారు నా ప్రియమైన బన్నీ. 20 అద్భుతమైన సంవత్సరాలు. అందులో నేను భాగం కావడం సంతోషంగా ఉంది’’ అంటూ ఆయన వ్యాఖ్య చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని