అంచనాలను పెంచేలా ట్రైలర్‌

విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’.

Published : 30 Mar 2023 02:24 IST

విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. బుధవారం రాత్రి చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను  విడుదల చేశారు. కమల్‌హాసన్‌, శింబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. ‘ఎవరూ చేయని సాహసాన్ని దర్శకుడు మణిరత్నం చేసి చూపించారు’ అన్నారు. ‘పీఎస్‌ 2’ కోసం అందరు అభిమానుల్లాగే తాను కూడా ఎదురుచూస్తున్నట్లు ఐశ్వర్యారాయ్‌ పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని సందడి చేసింది. తొలి చిత్రాన్ని మించి ఈ సినిమా ఉండేలా ఉంది, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసిందంటూ నెటిజన్లు స్పందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఏప్రిల్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 న్యూస్‌టుడే, కోడంబాక్కం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు