అమెరికాలో శతజయంతి ఉత్సవాలు

తెలుగువాళ్లకి గర్వకారణమైన  ముగ్గురు మహనీయుల శతజయంతి ఉత్సవాలు ఒక వేదికపై జరగడమంటే అదొక అపురూపమైన ఘట్టం అన్నారు సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌, జయసుధ, అలీ, చంద్రబోస్‌.

Published : 30 Mar 2023 02:25 IST

తెలుగువాళ్లకి గర్వకారణమైన  ముగ్గురు మహనీయుల శతజయంతి ఉత్సవాలు ఒక వేదికపై జరగడమంటే అదొక అపురూపమైన ఘట్టం అన్నారు సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌, జయసుధ, అలీ, చంద్రబోస్‌. మే 26, 27, 28 తేదీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాట్స్‌) ఆధ్వర్యంలో సినీ దిగ్గజాలు ఎన్టీఆర్‌, అల్లు రామలింగయ్య, ఘంటసాల శతజయంతి ఉత్సవాల్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాల్ని వెల్లడించింది. నాట్స్‌ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ ‘‘ఉత్తర అమెరికా తెలుగు సంబురాల్లో భాగంగా తెలుగు పెద్దల శతజయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని