Kajal: బాలీవుడ్ కాదు.. దక్షిణాదే ఇష్టం
హిందీ చిత్రపరిశ్రమలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయంటూ కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు పొంది పలు బాలీవుడ్లో చిత్రాల్లోనూ నటించింది కాజల్.
హిందీ చిత్రపరిశ్రమలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయంటూ కాజల్ (Kajal) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు పొంది పలు బాలీవుడ్లో చిత్రాల్లోనూ నటించింది కాజల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్రపరిశ్రమలోనే పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పింది. ‘హిందీ నా మాతృభాష. హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. బాలీవుడ్లో మంచి సినిమాల్లోనే నటించా. కానీ, నేను దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నైతికత, విలువలు, క్రమశిక్షణను ఇష్టపడతాను. అవి హిందీ చిత్రపరిశ్రమలో లోపించాయని అనుకుంటున్నాను’ అని చెప్పింది. ‘దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భాష కాబట్టి హిందీలో తమ వృత్తిని ప్రారంభించాలనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ, దక్షిణాది చిత్రపరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అద్భుతమైన దర్శకులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో మంచి కంటెంట్ వస్తుంటుంది’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో హిందీ చిత్రం ‘ఉమ’తో పాటు ‘భారతీయుడు 2’, బాలకృష్ణ ‘ఎన్బీకే 108’ చిత్రాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు