Raviteja: ‘రావణాసుర’ అందరినీ అలరిస్తుంది: రవితేజ
రవితేజ కథానాయకుడిగా సుధీర్ వర్మ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి.టీమ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
రవితేజ (Raviteja) కథానాయకుడిగా సుధీర్ వర్మ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ (Ravanasura). అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి.టీమ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సుశాంత్ కీలక పాత్ర పోషించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం నన్నెంతో అలరించింది. మిమ్మల్నందరినీ కూడా అలాగే అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఏప్రిల్ 7న థియేటర్స్లో విజిల్స్ మోత మోగుతుంది. సుశాంత్తో కలిసి పనిచేయడం చాలా నచ్చింది. ఇందులో ఆయన అద్భుతమైన పాత్ర చేశారు. ఈ చిత్రంతో మరో కొత్త సుశాంత్ను చూడబోతున్నారు. నాకిష్టమైన దర్శకుల్లో సుధీర్ వర్మ ఒకరు. ఈ చిత్రంతో తను మరో స్థాయికి వెళ్తాడు. ఈ చిత్రానికి ‘రావణాసుర’ అనే టైటిల్ పెట్టింది.. పోస్టర్లను డిజైన్ చేసింది నిర్మాత అభిషేక్ నామానే. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాగే శ్రీకాంత్ విస్సాతోనూ చాలా సినిమాలు చేయాలి. నా తర్వాత సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’కు తనే రచయిత. ఈ మధ్య నా డ్యాన్సులు మీకు నచ్చుతున్నాయంటే దానికి కారణం శేఖర్. ఇటీవల కాలంలో నా సినిమాలన్నింటికీ తనే కొరియోగ్రాఫర్. ఈ సినిమాలోని మూడు పాటలకు తనే నృత్యరీతులు అందించారు. ఈ చిత్రానికి భీమ్స్, హర్షవర్ధన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులోని నాయికా పాత్రలన్నీ చాలా చక్కగా కుదిరాయి. అను, మేఘా, ఫరియా, దక్షా.. ఇలా ఎవరి పాత్రను వాళ్లు చక్కగా చేశారు. కచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. థియేటర్లో దుమ్ములేపుతుంది’’ అన్నారు. ‘‘శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. ఇందులో నన్ను సుధీర్ చాలా కొత్తగా చూపించారు. ఈ సినిమా గురించి ఒకటే చెబుతా.. రవితేజను ఇందులో చూసినట్లు గతంలో ఎప్పుడూ చూసుండరు’’ అన్నారు నటుడు సుశాంత్. చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ‘‘స్వామిరారా’ చిత్రం తర్వాత నుంచి రవితేజతో కలిసి పని చేద్దామని చాలా సార్లు అనుకున్నా. కానీ, కుదర్లేదు. ఎట్టకేలకు ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. శ్రీకాంత్ విస్సా రాసిన కథ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సినిమా చూసి థ్రిల్ అవుతారు. షాక్ అవుతారు. ఈ చిత్రంలో మరో సర్ప్రైజ్ సుశాంత్’’ అన్నారు. నటి మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద చిత్రంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ చిత్రం చేయడం ద్వారా రవితేజ నుంచి ఎంతో నేర్చుకోగలిగా. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలనుంది’’ అంది. ఈ కార్యక్రమంలో డి.సురేష్బాబు, గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వివేక్ కూచిభొట్ల, భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్, దక్ష, పూజిత, శ్రీకాంత్ విస్సా, కాసర్ల శ్యామ్, ఆది తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె