సంక్షిప్త వార్తలు(2)
గౌతమ్ కార్తీక్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఎన్.ఎస్.పొన్కుమార్ తెరకెక్కించారు.రేవతి శర్మ, పుగాజ్, రిచర్డ్ ఆష్టన్, జాసన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘16 ఆగస్టు 1947’న ఏం జరిగింది?
గౌతమ్ కార్తీక్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఎన్.ఎస్.పొన్కుమార్ తెరకెక్కించారు.రేవతి శర్మ, పుగాజ్, రిచర్డ్ ఆష్టన్, జాసన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఏప్రిల్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మురుగదాస్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ టైమ్లో పొన్కుమార్ రాసిన కథ చదివాను. చాలా అద్భుతంగా అనిపించింది. వెంటనే దీన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. మన భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో 1947 ఆగస్టు 15వ తేదీకి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. ఇదీ అదే ఏడాదిలో సాగే కథతోనే ఓ పీరియాడిక్ చిత్రంగా రూపొందింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు ఈ మూడు రోజుల కాలంలో సెంఘాడ్ అనే మారుమూల గ్రామంలో ఏం జరిగిందన్నది ఇందులో చూపించాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయమే తెలియని ఆ ఊరి వాసులంతా తమ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం బ్రిటిష్ వారితో ఎలా పోరాటం చేశారన్నది ఆసక్తికరంగా చూపించాం. ప్రేమ, భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు.. ఇలా అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. త్వరలో ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నాను’’ అన్నారు. ‘‘గత వారం ట్రైలర్ విడుదలైంది. అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. ఏప్రిల్ 14న సినిమా థియేటర్లలోకి వస్తోంది. దాన్నీ అదే విధంగా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు పొన్కుమార్. హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది. దీని కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశమిచ్చినందుకు మురుగదాస్కు కృతజ్ఞతలు. చాలా మంచి చిత్రమిది. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. తెలుగు వారికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సినిమా చూశాం. ఇందులోని హీరోయిజం, క్లైమాక్స్ చాలా కొత్తగా అనిపించాయి. అందుకే దీన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ఠాగూర్ మధు. ఈ కార్యక్రమంలో యూసఫ్ షేక్ పాల్గొన్నారు.
ఉత్కంఠభరిత ప్రయాణం
గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో కాకర్ల శ్రీనివాసు తెరకెక్కించిన ఏక పాత్రాభినయ చిత్రం ‘హలో మీరా’. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘‘విజయవాడ నుంచి హైదరాబాద్కు ఓ యువతి చేసే రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తాజాగా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమా చిత్రీకరించడంపై ప్రశంసలు కురిపించారు’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి ఎస్.చిన్న సంగీతమందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?