ఆస్కార్తో తెలుగు సినిమా కీర్తి విశ్వవ్యాప్తమైంది
‘‘సమష్టికృషి ఫలితమే ఆస్కార్ పురస్కారం. ఈ విజయాన్ని సమష్టిగానే మెచ్చుకుంటూ పరిశ్రమ తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి.
విజేతల సన్మాన వేడుకలో ఇరు రాష్ట్రాల మంత్రులు
‘‘సమష్టికృషి ఫలితమే ఆస్కార్ పురస్కారం. ఈ విజయాన్ని సమష్టిగానే మెచ్చుకుంటూ పరిశ్రమ తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ‘ఆర్ఆర్ఆర్’ స్వరకర్తగా అందులోని నాటు నాటు... పాటకిగానూ ఆయన, రచయిత చంద్రబోస్ ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆదివారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వి.శ్రీనివాస్గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆస్కార్ విజేతలకి శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరఫున పలువురు సినీ ప్రముఖులు సన్మానం చేశారు.
రామోజీరావు అన్నప్పుడు ఆస్కార్ విలువ తెలిసింది
సత్కారం అందుకున్నాక కీరవాణి మాట్లాడుతూ ‘‘ఎక్కడైనా మూల విగ్రహాలు గుడిలోనే ఉంటాయి. వాటి తరఫున ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుల్లో పాల్గొని హారతులు అందుకుంటాయి. అలా ఈ చిత్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం రావడం వెనక ప్రధానమైన కృషి చేసిన మూల విగ్రహాల్లాంటి వ్యక్తులు దర్శకుడు రాజమౌళి, నృత్య దర్శకుడు ప్రేమ్రక్షిత్లు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ అంతా ఒక చోట చేరడం సంతోషంగా ఉంది. నేను మొట్టమొదటి పాట రికార్డ్ చేసింది మద్రాస్లోని ప్రసాద్ 70 ఎం.ఎం థియేటర్లో. ఉన్నత సాంకేతిక విలువల్ని దృష్టిలో పెట్టుకుని రమేష్ప్రసాద్ కట్టిన థియేటర్ అది. దేవాలయంలాంటి అలాంటి థియేటర్లో పాట చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. దాని ముందు ఆస్కార్ పురస్కారం తీపి తిన్నాక మంచి టీ తాగినట్టు అనిపించింది. ఆస్కార్ ప్రతిష్ఠాత్మకమైనదని తెలుసు, వస్తే మంచిదనే సదుద్దేశంతో ఉన్నా. కానీ అంత ఆత్రుతేమీ లేదు. ‘బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలి’ అని నా భార్య ఎప్పుడూ అంటూ ఉంటుంది. అలాంటి రామోజీరావుని కలవడానికి వెళ్లినప్పుడు ‘మీరు ఆస్కార్ని తీసుకురండి’ అని ఆయన చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. ‘ఆస్కార్కి ఆయన ఇంత విలువ ఇస్తున్నారంటే, అందులో విలువ ఉందన్నమాట. ఆయన కోసమైనా ఈ పురస్కారం మాకు రావాల’నే ఓ ఆత్రుత నాలో కలిగింది. అందుకే పురస్కారం ప్రకటిస్తున్నప్పుడు నాలో ఉద్వేగం కలిగింది’’ అన్నారు.
* చంద్రబోస్ మాట్లాడుతూ ‘‘ఆస్కార్ పురస్కారం నా దృష్టిలో ఒక అబద్ధంలాంటి నిజం. ఒక స్వప్నంలాంటి సత్యం. ఒక ఊహలాంటి వాస్తవం. ఒక కల్పనలాంటి యథార్థం. దాన్ని సాధ్యంచేసిన రాజమౌళికీ, ఆయన బృందానికి ధన్యవాదాలు. నా జీవిత గమనాన్ని మార్చింది శ్రీనాథ్ అనే మిత్రుడు, సంగీత దర్శకుడు కీరవాణి. శ్రీనాథ్ వల్ల రచనవైపు వచ్చా. ‘పెళ్ళిసందడి’ సమయంలో నన్ను చెన్నైకి తీసుకెళ్లినప్పట్నుంచి కీరవాణితో నా అనుబంధం కొనసాగింది. ఆయన నన్నొక సోదరుడిగా భావిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ‘బాహుబలి’కి నేను రాయకపోయినా, ఈ సినిమాకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో పాట రాశా. సహనం, ఓర్పు కోల్పోకుండా 19 నెలలు కష్టపడ్డా. ఆస్కార్ అందుకున్నప్పుడు భారత జాతీయ సాహిత్య గౌరవాన్ని, కీర్తి పతాకాన్ని చేత పట్టిన ఆనందం కలిగింది. పురస్కారాన్ని ఇంటికి తీసుకొచ్చాక ఆ స్ఫూర్తి ఫలాల్ని పంచాలని నా పాట ప్రయాణంలో భాగమైన అందరినీ కలుస్తూ వెళ్లా. అదినాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అన్నారు.
* తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘‘మొట్ట మొదట ఒక తెలుగు పాటకి ప్రపంచస్థాయిలో అత్యున్నతమైన ఆస్కార్ రావడం గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే చిత్ర పరిశ్రమకి ఇబ్బంది కలుగుతుందనే అనుమానాలు, భయాలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయూతనిచ్చింది. నాటు నాటు పాటలో పొలంగట్టు, మిరపతొక్కు, జొన్నరొట్టె, పోలేరమ్మ, పోతురాజు... ఈ మాటలు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మనం అందరం ఒక్కటే అని చాటి చెప్పిన ఈ పాటకి పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా ప్రభుత్వం తరఫున అందిస్తాం’’ అన్నారు.
* తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా ‘బాహుబలి’ సినిమాతోనే విశ్వవ్యాప్తమైంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏదైనా సాధించాలంటే రాజమౌళితోనే సాధ్యమని అర్థమైంది. ఆ సినిమా వచ్చాక దేశ రాజకీయాల్లోనూ బాహుబలి గురించి మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్కి వెళుతుందంటే మన తెలుగు బిడ్డ తీసిన సినిమాకి విశ్వ గౌరవం దక్కాలని అంతా ఎదురు చూశారు. అదే జరిగింది’’ అన్నారు.
* ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ‘‘తెలుగు కీర్తి విశ్వవ్యాప్తమైన సందర్భం ఇది. విశ్వంలోని తెలుగు జాతి ఆనందించిన తరుణం. రాజమౌళి చేసిన గొప్ప ప్రయోగం... ‘ఆర్ఆర్ఆర్’ని కీరవాణి కీర్తివాణిగా మిగిల్చారు. చంద్రబోస్ రచనలో చంద్రుడు అనిపించుకున్నారు. ఈ ముగ్గురి కలయిక తెలుగువారిని గర్వపడేలా చేసింది. చిత్ర పరిశ్రమకి కావల్సిన వసతులు, అనుమతుల్ని రాష్ట్రంలో ఉచితంగానే ఇస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, సెంథిల్ కుమార్, కార్తికేయ, కాలభైరవ, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, మామిడి హరికృష్ణ, సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్శులు కె.ఎల్.దామోదర్ప్రసాద్, టి.ప్రసన్నకుమార్, వై.వి.ఎస్.చౌదరి, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాశీ విశ్వనాథ్, వి.ఎన్.ఆదిత్య, రచయితల సంఘం ప్రతినిధులు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, సినీ మ్యుజీషియన్స్ ప్రతినిధులు రామాచారి, రమణ, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు సునీల్నారంగ్, అనుపమ్రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు వల్లభనేని అనిల్కుమార్, ఎస్.దొరై, మా ప్రతినిధులు మాదాల రవి, రానా దగ్గుబాటి, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు బసిరెడ్డి, కె.ఎల్.నారాయణ, దిల్రాజు, సురేష్బాబు, శ్యాంప్రసాద్రెడ్డి, నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, భోగవల్లి ప్రసాద్, రాజశేఖర్, జీవిత, ఎస్.గోపాల్రెడ్డి, శ్రీవాస్, ముప్పలనేని శివ, అశోక్కుమార్, ఎ.రమేష్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్