కొత్తగా ప్రయత్నిస్తే వచ్చేది విజయమే!
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చిత్రసీమ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నాలుగు ఫైట్లు, ఆరు పాటలనే రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములాకు క్రమంగా దూరమవుతోంది.
ప్రయోగాల బాటలో అగ్రతారల పయనం
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చిత్రసీమ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నాలుగు ఫైట్లు, ఆరు పాటలనే రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములాకు క్రమంగా దూరమవుతోంది. ప్రయోగాలు చేయడానికి అగ్ర కథానాయకులు తెగువ చూపుతుంటే.. వాళ్లను ప్రోత్సహించడానికి దర్శక నిర్మాతలు.. ఆ ప్రయత్నాల్ని ఆదరించి ఆశీర్వదించడానికి ప్రేక్షకులు సదా సిద్ధంగా ఉంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో కొత్త తరహా కథలు చూసే అవకాశం దక్కుతోంది. అగ్ర తారల చిత్రాలు వైవిధ్యతను పులుముకొని సరికొత్తగా తెరపై కాంతులీనుతున్నాయి. ఫలితంగానే తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుపులు మెరిపిస్తోంది.
‘‘ఒకప్పుడు ప్రయోగం చేయడాన్ని సాహసోపేతంగా చూసేవారు. కానీ.. ఇప్పుడదే విజయ సూత్రంగా మారిపోయింది. రొటీన్ కమర్షియల్ సినిమా చేయడాన్ని నిర్మాతలే సాహసంగా చూసే పరిస్థితులొచ్చాయి’’. - ఇటీవల ఓ యువ దర్శకుడు చెప్పిన మాటిది. ఇది అక్షర సత్యం కూడా. ఈ మార్పును అగ్ర తారలూ గుర్తించి, స్వాగతిస్తున్నారు. అందుకే మెల్లగా తమ ఇమేజ్ ఛట్రం నుంచి బయట పడే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ‘కొత్తగా ప్రయత్నిస్తే పోయేదేముంది?’ అంటూ వాళ్లు తెగువ చూపిస్తుండటంతో దర్శకులు సైతం వాళ్ల ఇమేజ్కు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలు సిద్ధం చేస్తున్నారు. కొత్తదనం నిండిన కథల్ని.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు నాగార్జున. ఇప్పుడాయన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది నాగ్కు ఓ కొత్త తరహా ప్రయత్నమే. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ఆయన సరికొత్త మాస్ లుక్తో కనువిందు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తన లుక్ను కూడా మార్చుకున్నారు నాగ్. అంతే కాదు ఇందులో ఆయన పాత్ర రెండు కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్నట్లు తెలిసింది. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’తో హిట్టు కొట్టి జోరు చూపించారు బాలకృష్ణ. ఇప్పుడాయన అనిల్ రావిపూడితో ఓ మాస్ యాక్షన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలయ్యను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు అనిల్. బాలకృష్ణ లుక్ నుంచి పలికే సంభాషణల వరకు ప్రతి విషయంలోనూ కొత్తదనం కనిపించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం కోసం అదే యాసలో సంభాషణలు పలకనున్నారు బాలయ్య. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరోయిజానికి దూరంగా...
ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘బ్రో’ కూడా ఒకటి. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కమర్షియాలిటీ, హీరోయిజాలకు భిన్నంగా సాగనుందని తెలిసింది. ఈ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రంలో పవన్ భగవంతుడిగా కనిపించనున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా జులై 28న థియేటర్లలోకి రానుంది. ఇటీవలే ‘రావణాసుర’లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించి అందరినీ మెప్పించారు రవితేజ. ఇప్పుడాయన ‘టైగర్ నాగేశ్వరరావు’గా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు తొలి బయోపిక్. 70ల కాలంలో పేరు మోసిన స్టూవర్ట్పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథతో రూపొందుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చిత్రణ.. ఆయన లుక్ కూడా చాలా విభిన్నంగా ఉండనున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక సరికొత్త హారర్ కామెడీ కథాంశంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇలాంటి కథలో నటించడం ప్రభాస్కు ఇదే తొలిసారి. అందుకే ఇందులో ప్రభాస్ హంగామా ఎలా ఉంటుందో చూసేందుకు సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత నుంచి పూర్తిగా కొత్త దారిలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు కథానాయకుడు రామ్చరణ్. దీనికి తగ్గట్లుగానే ఒక చిత్రంతో మరో సినిమా పోలిక లేకుండా వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఇది చరణ్కు తొలి క్రీడా నేపథ్య చిత్రమవుతుందని సమాచారం. మరి మన అగ్ర తారలు చేస్తున్న ఈ ప్రయోగాలకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాల్ని అందిస్తారో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.