నేను మళ్లీ సంగీతం చేయాలన్నది ఆయన కోరిక
‘‘ట్రెండ్ని అప్పుడూ అనుసరించలేదు, ఇప్పుడూ లేదు. సినిమాకి ఏది కావాలో అదే ఇస్తుంటా. చివరికి ప్రేక్షకుడికి నచ్చిందే ట్రెండ్ అవుతుంది’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఆయన - దర్శకుడు తేజ కలయికల్లో విజయవంతమైన చిత్రాలొచ్చాయి.
‘‘ట్రెండ్ని అప్పుడూ అనుసరించలేదు, ఇప్పుడూ లేదు. సినిమాకి ఏది కావాలో అదే ఇస్తుంటా. చివరికి ప్రేక్షకుడికి నచ్చిందే ట్రెండ్ అవుతుంది’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఆయన - దర్శకుడు తేజ కలయికల్లో విజయవంతమైన చిత్రాలొచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఆ ఇద్దరూ కలిసి ‘అహింస’ చేశారు. అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. పి.కిరణ్ నిర్మించారు. చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు ఆర్పీ.
‘‘సంగీతం చేయమంటూ మధ్యలో చాలా అవకాశాలొచ్చాయి. కానీ చేయాలనిపించలేదు. సమస్య ఏమిటంటే... నాకు కథ నచ్చితేనే చేస్తాను. నచ్చకపోతే అస్సలు చేయలేను. నా చేతిలో సినిమా ఉన్నా లేకపోయినా రోజుకి 18 గంటలు పనిచేయడం అలవాటు. ప్రస్తుతం కన్నడంలో కొన్ని సినిమాలు చేస్తున్నా. దర్శకత్వం కోసం కొన్ని కథలు రాస్తున్నా. నేనెన్ని చేసినా నాకు సంగీతమే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. సంగీత దర్శకుడిగానే నన్ను చూస్తారు. అయితే ఓ సందర్భంలో నేను సంగీతం చేయనని చెప్పి, మానేశా. కానీ ఎప్పుడు కలిసినా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మాత్రం ‘మళ్లీ సంగీతం ఎప్పుడు మొదలుపెడుతున్నావు’ అని అడిగేవాళ్లు. చేస్తాను గురువుగారూ అని చెప్పేవాణ్ని. ఆయన వెళ్లిపోయాక ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అనిపించింది. బాలు పాటపై ఉన్న అభిమానంతోనే నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చా. ఈ క్రమంలో ఓసారి దర్శకుడు తేజని కలిసినప్పుడు ‘మళ్లీ సంగీతం చేయాలి, అది బాలుగారి కోరిక’ అని చెప్పా. కొన్నాళ్ల తర్వాత తేజ ఫోన్ చేసి ‘చిత్రం 2’ చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ స్థానంలోనే... ‘అహింస’ చేశాం’’.
* ‘‘ఓ కొత్త రకమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. అహింస సిద్ధాంతాన్ని నమ్మే ఓ అబ్బాయి కృష్ణతత్వంవైపు వెళ్లే పరిస్థితులు ఎందుకొచ్చాయనేదే ఈ సినిమా. ఎప్పుడూ చూడని లొకేషన్లు ఈ సినిమాలో ఉంటాయి. నేపథ్య సంగీతం చేసేటప్పుడు చూశా, గొప్ప అనుభూతినిచ్చింది’’.
* ‘‘సంగీత దర్శకత్వమైనా, దర్శకత్వమైనా, గాయకుడిగా మారినా... ఏదైనా సరే, నమ్మిందే చేశా. నమ్మనిది ఏదీ చేయలేదు. నేను ఎవరి దగ్గర సహాయకుడిగా పనిచేయలేదు. సంగీతం నేర్చుకోలేదు. ఏ వాయిద్యం నాకు రాదు. అయినా సరే టైమ్లెస్ సంగీతం ఇచ్చే అవకాశం నాకు సినిమాలు ఇచ్చాయి. అలాంటి సంగీతాన్ని ఇచ్చిన ప్రతిభ మాత్రం నాది కాదని నమ్ముతుంటా. పూర్వజన్మలో నా ఆత్మ పెద్ద సంగీత దర్శకుడిదని, ఆయన కోరిక నాతో తీర్చుకున్నాడని ఈమధ్యే నాతో నేను ప్రయాణం చేశాక అర్థమైంది. నాకు గుర్తింపు సంగీత దర్శకుడిగానే ఉన్నా... రాయడం అంటే చాలా ఇష్టం. తదుపరి దర్శకుడిగా ఓ సంగీత ప్రధానమైన సినిమాని తెరకెక్కించడంకోసం సన్నాహాలు చేస్తున్నా. ఎన్నికల నేపథ్యంలోనూ ఓ కథ ఉంది. ఆ సినిమా విడుదలైతే ఎన్నికలు జరిగే తీరులోనే మార్పొస్తుంది. ‘బ్రోకర్’ సినిమాలో అందులో ఒక్క శాతం అవుతుందంతే. వెబ్ సిరీస్ కోసం కూడా రెండు కథలు రాశా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు