Thiruveer: ఆ స్వేచ్ఛ దొరికింది ఇప్పుడే!
‘‘ఇప్పటివరకూ నన్ను ప్రతినాయక కోణంలోనే చూస్తూ అవకాశాలిచ్చారు. చేసిన సినిమాలు.. పాత్రల ప్రభావం అలాంటిది.
‘‘ఇప్పటివరకూ నన్ను ప్రతినాయక కోణంలోనే చూస్తూ అవకాశాలిచ్చారు. చేసిన సినిమాలు.. పాత్రల ప్రభావం అలాంటిది. ఇప్పటికీ నా దగ్గరికి అలాంటి పాత్రలు వస్తుంటాయి. ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి చాలా సమయమే పట్టింది. ‘మసూద’ సినిమాతో నాలోని అమాయకత్వం కూడా బయటికొచ్చింది. ‘పరేషాన్’ (Pareshan)తో నాలోని అన్ని కోణాలూ కనిపిస్తాయి. ఇప్పట్నుంచి కథలు రాసుకునేవాళ్లకి నేనూ ఓ ప్రత్యామ్నాయం అవుతా’’ అన్నారు తిరువీర్ (Thiruveer). ‘పలాస’, ‘ఘాజీ’, ‘టక్ జగదీష్’, ‘మసూద’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకి చేరువైన నటుడీయన. ఆయన ప్రధాన పాత్రధారిగా ‘పరేషాన్’ తెరకెక్కింది. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తిరువీర్ మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ఇదివరకు చేసిన ‘మసూద’ సీరియస్ కథే అయినా... నేను కనిపించినప్పుడంతా ప్రేక్షకులు నవ్వుకున్నారు. ‘పరేషాన్’ సినిమాతో ఇంకా ఎక్కువగా నవ్వుకుంటారు. ఇందులో ప్రతి పాత్రకీ ఏదో ఒక పరేషాన్ ఉంటుంది. అందుకే ఈ పేరు పెట్టాం. సహజంగా, పాత్రల అమాయకత్వం నుంచి పుట్టిన హాస్యంతో రూపొందిన చిత్రమిది. 2020లో కరోనా తొలి దశలో లాక్డౌన్ సడలింపుల తర్వాత చేసిన సినిమా ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలే దాదాపుగా 20 నెలలు చేశాం. ఆ కథకి తగ్గట్టుగా సహజత్వం కోసమే ఇదంతా. సింగరేణి కుర్రాళ్ల కథ ఇది. నేనొక పాస్టర్ కొడుకుగా కనిపిస్తా’’.
* ‘‘దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్ ఓ నాలుగు సన్నివేశాల కోసం ఆడిషన్ ఆడిగాడు. ఆ నాలుగు సన్నివేశాలు చెప్పినప్పుడే మరేమీ ఆలోచించకుండా నేను ఈ సినిమా చేస్తానని చెప్పా. అంత కొత్తగా అనిపించింది తన రచన. తను చూసిన జీవితం, ఊరు, స్నేహాలు, అక్కడి ప్రజల పాత్రల్ని తీసుకుని ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించారు. కథ, పాత్రలు, లొకేషన్లు... అన్నీ కొత్తగా ఉంటాయి. చిత్రీకరణ కోసం మంచిర్యాలలోనే రెండు నెలలు గడిపా. కేరళలా అనిపించింది ఆ ప్రదేశం. రానా దగ్గుబాటి ఈ సినిమాని చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. చూడటం పూర్తయ్యాక ‘నాకు తెలియని ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్లిందీ చిత్రం. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయగలనో చెప్పండి?’ అని అడిగారు. తను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాక తన సొంత సినిమాలా భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు’’.
* ‘‘ఇప్పటివరకూ పాత్రల్ని ఎంపిక చేసుకునే అవకాశమే నాకు రాలేదు. మిగిలిన పాత్రల్నే నేను చేశా. అయితే థియేటర్ ఆర్ట్స్ చేశాక నటుడిగా నేనెలాంటి సినిమాలు చేయాలనుకున్నానో అలాంటివే నాకోసం మిగిలాయి. వాటినే చేశా. ‘మసూద’ తర్వాత అంటే.. ఈ ఏడాది నుంచే నేను కథల్ని, పాత్రల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు ఇది చేశాను కాబట్టి, తర్వాత ఇదే చేస్తానని కాకుండా... కథ, కథలోని పాత్ర బాగుంటే చేయడానికి సిద్ధమైపోతున్నా. కొత్తగా నాలుగు సినిమాలు ఒప్పుకున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్ఫ్లిక్స్లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్