మార్షల్ఆర్ట్స్ వీరుడు.... మల్లయోధుడు కలిస్తే హిడెన్ స్ట్రైక్
మార్షల్ ఆర్ట్స్లో ధీరుడెవరంటే సినిమా అభిమానులకు మొదటగా గుర్తొంచే పేరు జాకీచాన్. ఇప్పుడాయన ప్రముఖ మల్లయోధుడు జాన్ సెనతో కలిసి అలరించనున్నారు.
మార్షల్ ఆర్ట్స్లో ధీరుడెవరంటే సినిమా అభిమానులకు మొదటగా గుర్తొంచే పేరు జాకీచాన్. ఇప్పుడాయన ప్రముఖ మల్లయోధుడు జాన్ సెనతో కలిసి అలరించనున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘హిడెన్ స్ట్రైక్’ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ‘భవిష్యత్తులో ఆయిల్ వార్ జరుగుతుంది. దాన్ని ఇద్దరే ఆపగలరు’ అనే ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలై, మధ్యమధ్యలో వినోదం పంచే సన్నివేశాలతో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. ‘నీడ్ ఫర్ స్పీడ్’ చిత్ర దర్శకుడు స్కాట్ వాగ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్టు ఎక్స్, ప్రాజెక్టు ఎక్స్ట్రాక్షన్, స్నాఫు ఇలా అనేక పేర్లు మార్చిన ఈ చిత్రం చివరికి ‘హిడెన్ స్ట్రైక్’ పేరును ఖరారు చేసింది. ‘ఇద్దరు మాజీ ప్రత్యేక సైనిక దళాల వీరులు ఒక బృందాన్ని బాగ్దాద్లోని హైవే ఆఫ్ డెత్ నుంచి భద్రతయుతమైన గ్రీన్ జోన్కు తరలించాలి’. వారిద్దరూ ఆ బృందాన్ని ఎలా తరలిస్తారనేది ఈ సినిమాలో ఆసక్తికరం. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భార్య బాటలో రణ్వీర్
మన నటులు హాలీవుడ్లో సత్తా చాటడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ప్రియాంక చోప్రా అక్కడ తన హవా కొనసాగిస్తోంది. దీపికా పదుకొణె అప్పుడప్పుడూ మెరుస్తోంది. ఇప్పుడు ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ కూడా హాలీవుడ్లో అడుగుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ప్రముఖ హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ విలియం మోరీస్ ఎండివోర్ (డబ్ల్యూఎంఈ)తో ఒప్పందం చేసుకున్నారు. బెన్ అఫ్లెక్, హగ్ జాక్మెన్, మిచెల్ విలియమ్స్, క్రిస్టియన్ బలె, మాట్ డామోన్ లాంటి హాలీవుడ్ సెలబ్రెటీలు ప్రాతినిధ్యం వహిస్తున్న డబ్యూఎంఈలో రణ్వీర్ సింగ్ ఒక భాగం కావడం విశేషం. దీపికా పదుకొణె 2021 నుంచే మరొక హాలివుడ్ టాలెంట్ ఏజెన్సీ ‘ఐసీఎం’ కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 2010లో ‘బ్యాండ్ బాజా బరాత్’ చిత్రంలో అనుష్క శర్మతో కలిసి నటించి తన నటనతో పేక్షకులను కట్టిపడేసిన రణ్వీర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ కరణ్ జోహార్ దర్శకత్వంలో వస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో ఆలియా భట్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబాన అజ్మీ కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట