Director teja: కేవలం స్టార్స్ని చూసి సినిమాకెళ్లేలా ఉంటే ఫ్లాప్లే రావు!
తేజ సినిమా అనగానే కొత్తతరం నటులు గుర్తొస్తారు. ఆయన సినిమాలతో తారలుగా ఎదిగినవాళ్లు చాలామందే. ఆయన మరోసారి కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘అహింస’.
తేజ సినిమా అనగానే కొత్తతరం నటులు గుర్తొస్తారు. ఆయన సినిమాలతో తారలుగా ఎదిగినవాళ్లు చాలామందే. ఆయన మరోసారి కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘అహింస’. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మనవడు దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. పి.కిరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
కొత్తతరాన్ని తెరకు పరిచయం చేయడం మీకు కొత్త కాదు. ఇదివరకటితో పోలిస్తే అభిరామ్ని పరిచయం చేయడంలో ప్రత్యేకత ఏమైనా ఉందా?
కథే ఆ వ్యత్యాసం చూపిస్తుంది. కథకి ఏం అవసరమో అదే చేస్తుంటా. మొదట కథని పట్టుకుంటా. అది ఎటు తీసుకెళితే అటు వెళతా. అలా కాకుండా... కథని కాదని ‘ఇతను ఫలానా అబ్బాయి కాబట్టి ఇది చేయాలి. ఇలా ఫైట్లు పెట్టాలి, డ్యాన్సులు పెట్టాలి’ అనే తత్వం నాది కాదు. అయితే ఇప్పుడు నేను సినిమా చేసింది రామానాయుడు కుటుంబమంలోని ఓ అబ్బాయితో. పెద్ద కుటుంబాలకి చెందిన హీరోలతో సినిమాలు చేసినప్పుడు సమస్య ఏమిటంటే వీళ్లని అందరూ భూతద్దంతో చూస్తారు. పోలికలు కూడా ఎలా ఉంటాయంటే... ఇప్పటికే స్టార్లు అయిపోయిన ఆ కుటుంబంలోని వెంకటేష్, రానా కోణంలోనే ఇతన్నీ చూడటం మొదలుపెడతారు. అదే ఎవ్వరికీ తెలియనివాళ్లని పరిచయం చేశామంటే... ఏదో ఒకడు వచ్చాడు వెళ్లాడన్నట్టే ఉంటుంది. సహజంగానే కొత్త నటులకి ఉండే బెరుకు, సమస్యలు కొన్ని ఉంటాయి. పెద్ద కుటుంబంలో నుంచి వచ్చాడు కాబట్టి వాటిని ఇంకా పెద్దగా చూస్తారు. ఇప్పుడు నాకంటే కూడా అభిరామ్ ఈదటం పెద్ద కష్టం.
ఇలాంటి హీరోల సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి కూడా ఎక్కువే ఉంటుంది. వాటితో మంచి ప్రారంభ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా?
ప్రేక్షకులు ఇప్పుడు చాలా స్మార్ట్గా తయారయ్యారు. ట్రైలర్, పోస్టర్ చూడగానే ఓ నిర్ణయానికొస్తారు.అప్పుడు ఆ సినిమాకీ, ప్రేక్షకుడికీ ఓ బంధం ఏర్పడుతుంది. దాన్నే మ్యాజిక్ అంటాం. అప్పుడే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. ఇవన్నీ జరగకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా ప్రేక్షకుడు థియేటర్కి వెళ్లడు. కేవలం స్టార్స్ని చూసి సినిమాకెళ్లే పరిస్థితులే ఉంటే పరాజయాలనేవే రావు కదా.
ఈ కథకి అభిరామ్నే ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?
నేను నిర్మాత డి.రామానాయుడు సర్కి మాట ఇచ్చా. ఆ మాట ప్రకారమే అభిరామ్తో సినిమా చేశా. మరో విషయం ఏమిటంటే... నేను నా పెట్టుబడులు మనుషులపైనే పెడతాను. ఆస్తులు, డబ్బులు, నగలపై పెట్టుబడి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఓ మనిషి నచ్చాడంటే చాలు... అతను మంచోడా చెడ్డోడా అనేది చూడను. అతనితో సినిమా చేయాలనుకుంటే చేసేస్తా. ఎందుకు చేస్తున్నానంటే నాకూ తెలియదు. కొంతమందిని ఎందుకు పరిచయం చేశానో నాకూ అర్థం కాదు.
‘అహింస’ కథకి మూలం ఏమిటి?
ఫిలాసఫీ ఆధారం చేసుకుని రాసిన కథ ఇది. అహింసని నమ్మే దేశం మనది. కానీ దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి మనం నమ్మే అహింసావాదాన్ని అనుసరిస్తే అవి జరగకూడదు కదా? మనం అనుసరించడం లేదంటే మనకి అది అర్థం కావడం లేదు, ఆ విషయంలో మనకు స్పష్టం లేదనే కదా! అసలు అహింసని ఎలా అనుసరించాలనే విషయాన్నే వాణిజ్యాంశాలు మేళవించి చెప్పే ప్రయత్నం చేశా.
మరోసారి అటవీ నేపథ్యంలో సినిమా తీయడానికి కారణం?
‘జయం’ తర్వాత ఆ నేపథ్యంలో సినిమా తీయడం ఇప్పుడే. కానీ ‘జయం’ విజయవంతమైన సినిమా కాబట్టి దాంతో పోల్చి చూస్తున్నారు. సినిమా అనేది దృశ్య, శ్రవణ మాధ్యమం. కథకి తగ్గట్టుగా ఓ మంచి కాన్వాస్ కూడా ఉండాలి. ఈ కథకి ఆ కాన్వాస్ కావాలనిపించింది. అందుకే మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. ఇందులో 14 యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. అవన్నీ కూడా కథలో భాగంగానే ఉంటాయి. అందులో ఓ నాలుగు పోరాట ఘట్టాల్ని నేనే డిజైన్ చేసి తెరకెక్కించా. ఆర్పీ పట్నాయక్, అనూప్ కలిసే సంగీతం సమకూర్చారు.
కొత్తవాళ్లతో చేసినట్టుగా... అగ్ర తారలతో సినిమాలు చేయరెందుకు?
పేరున్న తారలతో ఎక్కువ డబ్బు కోసం ఎక్కువ పేరు కోసమే కదా చేయాలి. నేను చూడని ఆస్తులు, నేను చూడని పేరా? ఇప్పుడు కూడా నేను ఏ సినిమాకీ ఇంత డబ్బు ఇవ్వండని అడగను. నాకు ఎంత ఇవ్వాలనుకుంటారో అంత ఇవ్వండని చెబుతా. ఫుట్పాత్ నుంచి వచ్చిన వాడిని నేను. నాకొకరు బ్రేక్ ఇచ్చారు. కానీ చాలా ప్రతిభ ఉండి కూడా, మార్కెట్ చేసుకోలేక కృష్ణానగర్లో తిరుగుతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకి ఎవరున్నారు? నేనున్నంత వరకూ వాళ్లకి నేను అవకాశాలు ఇస్తూనే ఉంటా. ఓ పెద్ద స్టార్తో సినిమా చేసినా సరే, అందులో చాలావరకు కొత్తవాళ్లకి అవకాశాలు ఇచ్చాను. మా ఇంట్లోవాళ్లకి కూడా డబ్బు, ఆస్తులపై ఆసక్తి లేదు. ఫలానా వారిలా సినిమా చేయవెందుకు అని నన్నెప్పుడూ అడగరు.
మీ ముందున్న తదుపరి లక్ష్యం ఏమిటి?
ఇప్పటివరకూ నటుల్ని పరిచయం చేశాను. ఇకపై కొత్తరకం సినిమాలు తీసే దర్శకుల్ని పరిచయం చేయాలని ఉంది. రామ్గోపాల్ వర్మ, మణిరత్నం, శేఖర్ కమ్ముల, తేజ... ఇలా మాకు ఒకొక్కరికీ ఒక్కో శైలి ఉంది. అలా కొత్త స్టైల్తో సినిమాలు తీసే దర్శకుల్ని తీసుకొస్తే పరిశ్రమ మరో స్థాయికి వెళుతుందని నా అభిప్రాయం.
తదుపరి మీరు రానాతో చేయబోయే సినిమా ఎలా ఉంటుంది?
‘రాక్షసరాజు’ పేరుతో ఆ సినిమా ఉంటుంది.
‘‘స్టూడియో... థియేటర్ నాకు దేవుడి గుడితో సమానం. ఈ గుడిలో ప్రారంభమై, ఆ గుడిలో ప్రదర్శితం అవుతాయి. ఈ మధ్యలోనే స్టార్లు తయారవ్వడం, లాభాలు రావడం, పోగొట్టుకోవడం అన్నీ జరుగుతాయి. ఆ రెండు గుళ్లనీ కాపాడుకోవాలి. నేను దర్శకనిర్మాతనే కాదు, ఎగ్జిబిటర్ని కూడా. నాకు థియేటర్ ఉంది. దాన్ని అమ్మేసి ఆ డబ్బుని బ్యాంక్లో వేసుకుని హాయిగా బతికేయొచ్చు. కానీ నాకు అది ఇష్టం లేదు. నా థియేటర్లో పాప్కార్న్ అయినా, ఏదైనా సరే రూ.వందకి మించకూడదనే నిబంధన పెట్టా. సమోసాలు కూడా వేడివేడిగా ఉండాల్సిందే. ప్రేక్షకుడి ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం అని నమ్ముతా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్