ఈ వేసవికి అంతంతమాత్రం.... వినోదాల చల్లదనం
సంక్రాంతి సందడి ముగిసిందనగానే సినీ ప్రేమికుల చూపులు వేసవివైపు మళ్లుతుంటాయి. వేసవి వినోదం అంటే మనకు సినిమానే గుర్తొస్తుంది.
అగ్రతారల సందడే లేదు
పోటాపోటీగా విడుదలయ్యే అగ్ర తారల సినిమాలు... కిక్కిరిసిపోయే హాళ్లు... అభిమానుల హంగామా... రికార్డు స్థాయి వసూళ్లూ...
- తెలుగు సినీ వేసవి అంటే ఇంత సందడి ఉంటుంది. సెలవుల్లో సరదాల కోసం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆశ్రయించేది సినిమానే. ఎక్కువ రోజులు కొనసాగే ఈ సీజన్లో అగ్ర తారల చిత్రాలు బాక్సాఫీసు ముందుకు దూసుకొస్తుంటాయి. మంచి టాక్ వచ్చిందంటే చాలు... వసూళ్లు హోరెత్తుతుంటాయి. రికార్డుల మోత మోగుతుంటుంది. ఈసారి స్టార్ల సందడి లేదు. కానీ... సినిమాలకి మాత్రం లోటు లేదు. మరి విజయాలు ఏ మేరకు? ప్రేక్షకుల్ని అలరించిన సినిమాలు ఎన్ని?
సంక్రాంతి సందడి ముగిసిందనగానే సినీ ప్రేమికుల చూపులు వేసవివైపు మళ్లుతుంటాయి. వేసవి వినోదం అంటే మనకు సినిమానే గుర్తొస్తుంది. ఏయే సినిమాల్ని చూడాలో ముందుగానే సిద్ధమైపోతుంటారు. 2023 వేసవి కూడా బోలెడన్ని ఆశల్ని రేకెత్తించింది. కొద్దిమంది అగ్ర తారలు తమ సినిమాల కోసం బెర్త్లు కూడా ఖాయం చేశారు. విడుదల తేదీల్ని ప్రకటించినవి కొన్నైతే... వేసవికి పక్కా అనే సంకేతాలు ఇచ్చిన సినిమాలు కొన్ని. కానీ వస్తాయనుకున్నవి చాలా వరకు రాలేదు. వచ్చిన సినిమాల్లోనూ అంచనాల్ని అందుకున్నవీ ఒకట్రెండే. జూన్ 16న విడుదలయ్యే ప్రభాస్ ‘ఆదిపురుష్’తో ఈ ఏడాది వేసవి ముగుస్తున్నట్టే. కానీ ఎప్పట్లా సందడి మాత్రం ఈసారి కనిపించలేదు. థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. రానున్న సినిమాలు ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలి.
‘దసరా’ మెప్పించినా...
మార్చిలో విడుదలైన ‘బలగం’, ‘రంగమార్తాండ’ చిత్రాలు వేసవికి శుభారంభాన్ని ఇచ్చాయి. మంచి సినిమాలుగా మెప్పు పొందడంతోపాటు..థియేటర్లకి వెళ్లాలనే ఓ ప్రత్యేకమైన ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించిన సినిమాలు అవి. అలాంటి మంచి వాతావరణం మధ్య మార్చి 30న నాని ‘దసరా’ విడుదలైంది. అసలు సిసలు వేసవి ఇప్పుడే ఆరంభమైందన్నట్టుగా ఆ సినిమా వసూళ్లతో హోరెత్తించింది. రూ.100 కోట్ల వసూళ్ల పోస్టర్తో సినిమా వ్యాపారానికి హుషారును తెచ్చిపెట్టింది. కానీ ఆ హుషారు ఎంతోసేపు నిలవలేదు. వరుసగా ఆ తర్వాత వారాల్లోనే విడుదలైన రవితేజ ‘రావణాసుర’, సమంత ‘శాకుంతలం’ ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయాయి. మంచి అంచనాల్ని రేకెత్తించిన ఈ సినిమాలు బాక్సాఫీసుని పెద్దగా ప్రభావితం చేయకుండానే వెనుదిరిగాయి. వేసవికి ఆయువుపట్టులాంటి ఏప్రిల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, అఖిల్ ‘ఏజెంట్’ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘విరూపాక్ష’ విజయాన్ని సొంతం చేసుకుంది. మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని భయపెడుతూ థ్రిల్ చేసింది. వేసవి సీజన్ని పక్కాగా సద్వినియోగం చేసుకుంది. భారీ వ్యయంతో రూపొందిన అఖిల్ ‘ఏజెంట్’ కనీస వసూళ్లని సొంతం చేసుకోలేకపోయింది. భారీ వ్యయంతో రూపొందిన ‘రావణాసుర’, ‘ఏజెంట్’, ‘శాకుంతలం’ చిత్రాలు పరాజయం కావడం చిత్రసీమకి ఓ పెద్ద కుదుపే.
ఆశలన్నీ ‘ఆదిపురుష్’పైనే..
అగ్ర తారల సినిమాలు లేక ఈ వేసవి వెలవెలబోయింది. పవన్కల్యాణ్, మహేష్బాబు, రామ్చరణ్, ఎన్టీఆర్ తదితర అగ్ర తారల సినిమాలు సెట్స్కే పరిమితం అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ల సినిమాలూ అంతే. నాగార్జున అయితే ఇంకా కొత్త సినిమాని పట్టాలెక్కించనేలేదు. ఇలా కీలకమైన ఆయా కథానాయకుల సినిమాలేవీ రాకపోవడంతో ఈ వేసవి కళ తప్పింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. భారీ వ్యయంతో తెరకెక్కిన ఆ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. రామాయణం ఆధారంగా రూపొందిన ఆ సినిమా ఈసారి వేసవికి ఎలాంటి ముగింపునిస్తుందో చూడాలి. ఈలోపుగా పరిమిత వ్యయంతో రూపొందిన కొన్ని సినిమాలు బాక్సాపీస్ ముందుకొస్తున్నాయి. శుక్రవారం ‘నేను స్టూడెంట్ సర్’, ‘అహింస’, ‘పరేషాన్’ తదితర చిత్రాలు విడుదలైయ్యాయి.
అనువాదాలే ‘మే’లు
గోపీచంద్ ‘రామబాణం’, అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ సినిమాలు మే నెలపై ఆశలు పెంచాయి. ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేకపోయాయి. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘కస్టడీ’, ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలు మంచి ప్రచారం చేసుకుని, అంచనాలు రేకెత్తించినా వాటికీ విజయాలు దక్కలేదు. ప్రచారంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘మళ్ళీ పెళ్లి’, ‘మేమ్ ఫేమస్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో టాక్ని సొంతం చేసుకోలేకపోయాయి. ‘మేమ్ ఫేమస్’ నచ్చిందంటూ మహేష్బాబు, రాజమౌళి తదితర సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. వసూళ్ల పరంగా ఆ చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. వేసవిలో అనువాద చిత్రాలూ పోటీపడుతుంటాయి. బాగుంటే వాటికీ బ్రహ్మరథం పడుతుంటారు తెలుగు ప్రేక్షకులు. ‘బిచ్చగాడు2’తో వచ్చిన విజయ్ ఆంటోనీకి మరో విజయం దక్కినట్టే. ఆ చిత్రానికి మంచి వసూళ్లు లభించాయి. మలయాళం నుంచి వచ్చిన ‘2018’ కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!