Tollywood: హీరో జోరు.. రానుంది కొత్త కబురు
విడుదలయ్యే సినిమాలు ఒక పక్క... కొత్తగా పట్టాలెక్కే సినిమాలు మరోపక్క! చిత్రసీమ ఎప్పుడూ ఓ నిత్య ప్రవాహంలా కనిపిస్తుంటుంది. విజయాలొచ్చినా... పరాజయాలు ఎదురైనా ఆ ప్రభావం కొన్నాళ్లే.
విడుదలయ్యే సినిమాలు ఒక పక్క... కొత్తగా పట్టాలెక్కే సినిమాలు మరోపక్క! చిత్రసీమ ఎప్పుడూ ఓ నిత్య ప్రవాహంలా కనిపిస్తుంటుంది. విజయాలొచ్చినా... పరాజయాలు ఎదురైనా ఆ ప్రభావం కొన్నాళ్లే. ఆ వెంటనే మరో కొత్త సినిమాకి క్లాప్ కొట్టాల్సిందే. ఒకప్పటిలా మన అగ్ర తారలు సినిమాకీ సినిమాకీ మధ్య విరామం తీసుకోవడం లేదు. ఒక సినిమా చేస్తున్నప్పుడే... మరో కథ రెడీ అయిపోతోంది. ఒకేసారి రెండు మూడు సినిమాలతోనూ జోరు ప్రదర్శిస్తున్న తారలూ ఇప్పుడు చాలా మందే. కరోనా తర్వాత మారిన ఆ పరిస్థితుల ప్రభావంతో రెండు మూడు నెలలకోమారు గంపగుత్తగా కొన్ని కలయికలు ఖరారవుతూ సినీ ప్రేమికుల్ని ఊరిస్తున్నాయి. రానున్న ఒకట్రెండు నెలల్లో ఈ హీరోలంతా వరుసగా కొత్త సినిమా కబుర్లు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ 108.. 8న
అగ్ర తారల కొత్త సినిమా విడుదలలే కాదు... పట్టాలెక్కనున్న వాళ్ల కొత్త సినిమా కబురు కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. తమ హీరో ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? ఎప్పుడు విడుదలవుతుంది? అది ఎలాంటి చిత్రం? అంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తుంటారు. అందుకే ఆయా సినిమాల అధికారిక ప్రకటనలు కూడా ఓ హంగామా మధ్య బయటికొస్తుంటాయి. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు ఈ నెల 10. ఈ సందర్భంగా ఆయన సినిమాలకి సంబంధించిన బోలెడన్ని కబుర్లు వినిపించనున్నాయి. ప్రస్తుతం సెట్స్పై ఉన్న 108వ సినిమా పేరుని 8వ తేదీనే అధికారికంగా ప్రకటిస్తారు. ప్రచార చిత్రం కూడా విడుదల కానుంది. అంతే కాదు... ఆయన తదుపరి సినిమా కూడా అధికారికంగా ఖరారు కానుంది. బాలకృష్ణ - బాబీ కలయికలో సినిమాని ఆ రోజు ప్రకటించేందుకు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బాబీ. మరోసారి తన శైలి మాస్ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరో అగ్ర తార చిరంజీవి కొత్త సినిమా కబురు కూడా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పలువురు యువ దర్శకులతో కథా చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ వేసవిలో ఓ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న యువ దర్శకుడితో చిరంజీవి సినిమా చేయనున్నట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ కలయికలో సినిమా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ‘భోళాశంకర్’ చేస్తున్నారు. అది కూడా చివరి దశకు చేరుకుంది.
‘క్రాక్’ కలయిక పక్కా
రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన ‘క్రాక్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయవంతమైన ఆ కలయికలో మరో చిత్రానికి రంగం సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’తో ఘన విజయాన్ని సొంతం చేసుకుని ఫామ్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్న రవితేజ కోసం మరో మాస్ స్క్రిప్ట్ని సిద్ధం చేస్తున్నారు గోపీచంద్ మలినేని. మరో అగ్ర కథానాయకుడు నాగార్జున నటించనున్న కొత్త సినిమా కోసం కూడా చాలా రోజులుగా కసరత్తులు సాగుతున్నాయి. ఈ నెలలోనే ఆ సినిమాకి సంబంధించిన కొత్త కబురు వినిపించే అవకాశాలు ఉన్నాయి.
యువ తారలు సిద్ధం
‘ఖుషి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తదుపరి సినిమా కూడా ఖరారైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆ సినిమా రూపుదిద్దుకోనుంది. దీంతోపాటు త్వరలో మరో సినిమానీ పట్టాలెక్కించేందుకు విజయ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. ‘గీతగోవిందం’ తర్వాత ఆ కలయికలో రూపుదిద్దుకోనున్న మరో చిత్రమిది. మరో యువ కథానాయకుడు నాగచైతన్య కూడా వెంటనే కొత్త సినిమాతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ‘కార్తికేయ2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయనున్నారు. ఇదివరకు ఈ ఇద్దరూ కలిసి ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాలు చేశారు. ఈ కలయికలో మూడో చిత్రం జీఏ2 నిర్మాణంలో రూపుదిద్దుకోనుందని సమాచారం. టాలీవుడ్లో సినిమా నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కలయికలు వెలుగులోకి వస్తున్నాయి. తెరవెనక మరిన్ని కలయికల కోసం స్క్రిప్టులు వడివడిగా సిద్ధం అవుతున్నాయి. ఇవి కాకుండా త్వరలోనే మరో దఫా కొత్త సినిమాల ప్రకటనలు రానున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం