కులూమనాలి చుట్టూ

రఘు రామ్‌, శ్రుతి శెట్టి, నైనా పాఠక్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఓహ్‌’. సత్యనారాయణ ఏకరీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

Published : 08 Jun 2023 01:18 IST

ఘు రామ్‌, శ్రుతి శెట్టి, నైనా పాఠక్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఓహ్‌’. సత్యనారాయణ ఏకరీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ ఈ నెల 10నుంచి వరంగల్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘కులూమనాలి నేపథ్యంలో వస్తున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. ఇప్పటికే కులుమనాలి, ఆగ్రా, హైదరాబాద్‌ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఇందులో ఐదు పాటలు, మూడు ఫైట్స్‌ ఉన్నాయి. ఈ నెల 10నుంచి వరంగల్‌లో రెండు ఫైట్స్‌ , 17నుంచి గోవాలో మరో పాట చిత్రీకరించనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని సెప్టెంబరు 29న విడుదల చేస్తాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని