బాలకృష్ణ.. భగవంత్ కేసరి
ఇప్పటి నుంచి ఆట వేరు అంటూ బాలకృష్ణ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై బాలకృష్ణ 108వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి నుంచి ఆట వేరు అంటూ బాలకృష్ణ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై బాలకృష్ణ 108వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మరో కీలక పాత్రని పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని గురువారం సినిమా పేరుని ప్రకటించారు. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నట్టే ‘భగవంత్ కేసరి’ అనే పేరుని ఈ సినిమాకి ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్... అనేది ఉపశీర్షిక. ‘‘పేరుకు తగ్గట్టే శక్తిమంతమైన కథ, పాత్రలతో రూపొందుతున్న చిత్రమిది. 108 చోట్ల, 108 హోర్డింగ్లతో సినిమా పేరుని ప్రకటించాం. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న 108 థియేటర్లలో టీజర్ను విడుదల చేయనున్నామ’’ని తెలిపాయి సినీ వర్గాలు.
* బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనపై ‘గ్లోబల్ లయన్’ పేరుతో ఓ ప్రత్యేక గీతాన్ని నిర్మించారు ఆయన అభిమాని అనంతపూర్ జగన్. ఆ పాటను హైదరాబాద్లో గురువారం దర్శకులు బి.గోపాల్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ‘‘జగమంతా పలికే మంత్రం జై బాలయ్య.. జనమందరికీ ఒకటే నినాదం జైబాలయ్య’’ అంటూ సాగుతున్న ఈ పాటకు ఈశ్వర్ దత్ స్వరాలు సమకూర్చగా.. రాంబాబు గోసాల సాహిత్యమందించారు.
వెయ్యి థియేటర్లలో ‘నరసింహనాయుడు’
బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన చిత్రం ‘నరసింహనాయుడు’ని ఈ నెల 10న 4కె డిజిటల్ ప్రింట్తో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రబృందం గురువారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. చిత్ర దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ‘‘నా కెరీర్లో మరిచిపోలేని చిత్రం ‘నరసింహనాయుడు’. 4కె సాంకేతికతతో రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా మరోసారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మురిపించడం ఖాయం’’ అన్నారు. నిర్మాత మేడికొండ మురళీకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంతోనే నేనూ జనాలకి సుపరిచితం అయ్యా’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి వెయ్యి థియేటర్లలో విడులదవుతుంది’’ అన్నారు టి.ప్రసన్నకుమార్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
రంగంలోకి రాజాసాబ్
‘రాజాసాబ్’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. -
తొలి హిందీ చిత్రం కాస్త ఆలస్యం?
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కీర్తి సురేశ్. త్వరలో ఆమె ‘బేబీ జాన్’తో ప్రేక్షకులను పలకరించనుంది. -
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
‘‘స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘పారిజాతపర్వం’. దీంట్లో అపరిమితమైన వినోదం ఉంది. తప్పకుండా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు హీరో చైతన్య రావు -
రెండు కోణాల్లో తమన్నా?
ది అన్టోల్డ్ స్టోరీ’, ‘రుస్తుం’, ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే. -
రామోజీ ఫిల్మ్సిటీలో అక్షయ్ సందడి
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. -
అమితాబ్కు లతా మంగేష్కర్ పురస్కారం
పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఇవ్వనున్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు -
నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు!
‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు -
వాస్తవ జీవిత కథే ఆధారం
‘‘ప్రేమకథతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’. ఇందులో మేము ఒక కొత్త అంశాన్ని స్పృశించాం. అది తప్పకుండా ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు దర్శకుడు వీఎస్ ముఖేష్. -
కన్నడ నటుడు ద్వారకీష్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకనిర్మాత ద్వారకీష్(81) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు కేజీ జయన్ మృతి
ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు కేజీ జయన్(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. -
ఆ అమ్మాయి జోలికి రావద్దు
‘‘ఆ అమ్మాయి నా ప్రాణం.. నా ఊపిరి. తన జోలికొస్తే వెతుక్కుంటూ వచ్చి నరికేస్తా’’ అని హెచ్చరిస్తున్నారు విశాల్. మరి ఆయన ప్రేమ కథేంటి? దానికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ‘రత్నం’ చూడాల్సిందే. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
కాలేజీ ఫెస్ట్లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రాముడికి ‘సూర్యతిలకం’.. కనులవిందుగా అద్భుత దృశ్యం
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
-
సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
-
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు