నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది!
‘భగవంత్ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
‘భగవంత్ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. అర్జున్ రాంపాల్, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘రాజు ఆని ఎనకున్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు’’ అంటూ బాలకృష్ణ చెప్పే శక్తిమంతమైన డైలాగ్తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో బాలయ్య విశ్వరూపాన్ని చూపించారు. ఆయన లుక్.. బాడీ లాంగ్వేజ్, యాక్షన్ హంగామా.. ప్రతిదీ చాలా కొత్తగా కనిపించాయి. ‘‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి. ఈపేరు శానా యేండ్లు యాదుంటది’’ అంటూ టీజర్ ఆఖర్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘మేము టీజర్లో చెప్పినట్లే.. ఈ పేరు శానా యేండ్లు యాదుంటది. ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమాలో బాలయ్య హిందీ డైలాగులు చెబితే థియేటర్లు దద్దరిల్లాయి. తెలంగాణ నేపథ్యం కావడంతో ఇందులోనూ అక్కడక్కడా హిందీ డైలాగులు పెట్టాం. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. తెలుగు సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని కచ్చితంగా ఆస్వాదిస్తార’’న్నారు. ‘‘బాలకృష్ణ చాలా ప్రత్యేకం. ఆయన వ్యక్తిత్వం అద్భుతం. తనతో కలిసి పని చేయడం గొప్ప ఆనందాన్నిచ్చింది’’ అన్నారు నటుడు అర్జున్ రాంపాల్. ఈ కార్యక్రమంలో హరీష్, సాహు, రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు.
109కి శ్రీకారం..: బాలకృష్ణ 109వ చిత్రాన్ని బాబీ తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. శనివారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టగా.. గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేశారు. త్రివిక్రమ్ గౌరవ దర్శకత్వం వహించారు. వి.వి.వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ను పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంపై ఉన్న అంశాల్ని బట్టి.. ఇది 1982 నేపథ్యంగా సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రమని అర్థమవుతోంది. ‘‘ప్రపంచానికి ఇతను తెలుసు. కానీ, ఇతని ప్రపంచం ఎవరికీ తెలియదు’’ అంటూ ఆ పోస్టర్పై ఉన్న వ్యాఖ్య ఆసక్తిరేకెత్తిస్తోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
100రోజుల వేడుక: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ’వీరసింహా రెడ్డి’ చిత్రం వంద రోజుల వేడుకను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్