victory madhusudhan rao: విక్టరీ చిత్రాల ఫ్యాక్టరీ
వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలితరం వైతాళికుల శతజయంతులు నిర్వహించుకొంటున్న తరుణమిది.
వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలితరం వైతాళికుల శతజయంతులు నిర్వహించుకొంటున్న తరుణమిది. ఈ కోవలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ల తొలిదశ విజయాల ప్రధాన భాగస్వాముల్లో మేటి దర్శకుడు వీరమాచినేని మధుసూదనరావు (victory madhusudhan rao) పేరు మరువలేనిది. వీరంతా బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో పుట్టినవారు కావడం విశేషం. 1923 జూన్ నెలలో బెజవాడ పక్కనున్న కృష్ణాజిల్లా ఈడుపుగల్లు గ్రామంలోని రామభద్రయ్య, అన్నపూర్ణమ్మ దంపతుల ఇంట నలుగురు సంతానంలో ఒకరిగా మధుసూదనరావు పుట్టారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎంతో వైవిధ్యమైన జీవనపోరాటం సాగించి.. ‘విక్టరీ’ మధుసూదనరావుగా ఆయన ఎదిగిన తీరు అసాధారణం. జూన్ 14న ఆయన శతజయంతి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో మధుసూదనరావు శతజయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలుగువారు గర్వించదగ్గ రీతిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 70కు పైగా చలనచిత్రాలను మనకు అందించిన దర్శక మేధావి స్ఫూర్తిదాయక జీవనయానం ఓమారు పరిశీలిద్దాం.
ఏడేళ్ల పసిప్రాయంలో తల్లి మృతితో రెండేళ్ల చెల్లెలి బాధ్యతలు.. సోడాలు అమ్మి, వేరుశనగ చేలలో పనిచేసిన చిట్టిచేతులు.. చదువెక్కడ ఆగిపోతుందోనని పరిగలేరి అమ్మిన విద్యార్థిదశ.. వారాలు చేస్తూ పునాదిపాడులో హైస్కూలు విద్యాభ్యాసం.. అభ్యుదయ భావాలతో ప్రజానాట్యమండలిలో చేరి నెలకు పాతిక రూపాయల జీతంతో పదేళ్లు పార్టీ సేవ.. కమ్యూనిస్టుల రహస్య కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గడిపిన జైలుజీవితం.. ప్రజానాట్య మండలిలో సహ కళాకారిణి సరోజినితో ప్రేమ, పాతిక రూపాయల ఖర్చుతో దండల పెళ్లి.. కుటుంబ జీవనానికి ఆ ఆదాయం చాలక బెజవాడలో కిళ్లీకొట్టు నడిపిన అనుభవం.. బతుకుతెరువు కోసం సినీ పరిశ్రమలోకి వెళ్లాక పదేళ్లు సహాయ దర్శకుడిగా, స్క్రిప్ట్ రచయితగా పోరాటం.. తొలినాళ్లలో రాబడి సరిపోక డ్రిల్ టీచరుగా, ట్యూషన్ మాస్టారుగా చిరు ఉద్యోగాలు.. ఊళ్లో తండ్రి చనిపోతే మద్రాసు నుంచి వెళ్లేందుకు వంద రూపాయల బాకీ కోసం నలుగురి చుట్టూ తిరగిన చేదు గుర్తులు.
మూడు పదుల వయసు నిండేనాటికి ఇన్ని కష్టాలకు ఎదురీదిన ఓ వ్యక్తి కొత్తరంగంలోకి అడుగు పెట్టి, విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకోవడం సాధారణ విషయం కాదు. ఇప్పటికీ వీరమాచినేని మధుసూదనరావు అంటే చాలామందికి తెలియదు. విక్టరీ మధుసూదనరావంటే (victory madhusudhan rao) తెలుగు సినీ అభిమానులకు ఆ రూపం, ఆయన తీసిన కుటుంబ కథాచిత్రాలు ఇట్టే గుర్తుకువస్తాయి. విద్యార్థి దశ నుంచే నాటకానుభవం కూడా ఉన్న ఆయనకు ఆ రంగంలో ముందే పరిచయమైన ఎన్టీఆర్, తాతినేని ప్రకాశరావు లాంటి వారి సహకారంతో సినీరంగ ప్రవేశం సులువుగానే జరిగింది. నేటి ప్రముఖ దర్శకుడైన కె.రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్.ప్రకాశరావు నిర్వహిస్తున్న ప్రకాశ్ స్టూడియోలో వంద రూపాయల జీతంతో ‘కన్నతల్లి’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు. నటీనటులకు వాచక పాఠాలు చెప్పడం ఈయన పని. సుమారు పదేళ్లు ఇలా నెట్టుకొచ్చిన మధుసూదనరావు 1959లో ‘సతీ తులసి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తి భక్తిరస ప్రధాన చిత్రంతో పరిచయం కావడం విశేషం. ఇదొక్కటే కాదు.. ఆ తర్వాతి కాలంలో అక్కినేనితో తీసిన ‘భక్త తుకారాం’, ‘చక్రధారి’ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలను సైతం ఘన విజయాలుగా మలిచిన సవ్యసాచి ఆయన. 1959లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన మధుసూదనరావు కేవలం ఇరవై ఏళ్ల వ్యవధిలో 90 శాతం విజయాలతో 1979 నాటికి కృష్ణంరాజు హీరోగా తీసిన ‘శివమెత్తిన సత్యం’తో 50 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్రాసులో ఆయన శిష్యులు ఘనమైన స్వర్ణోత్సవ సభ ఏర్పాటుచేసి గురువును సత్కరించారు. పి.చంద్రశేఖర్రెడ్డి, ఎ.కోదండరామిరెడ్డి లాంటి ప్రముఖ దర్శకులు ఆయన శిష్యులే. 1983లో హైదరాబాదు కేంద్రంగా ‘మధు ఫిలిం ఇన్స్టిట్యూట్’ను ప్రారంభించి నటనపరంగానూ పలువురికి శిక్షణ ఇచ్చి నటగురువు అనిపించుకున్నారు.
* రీమేక్ చిత్రాలను తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసి విజయవంతం చేయడంలో మధుసూదనరావుకు మంచి పేరుంది. ఈ కారణంగానే నటుడు నాగార్జున ‘విక్రమ్’ (హిందీలో హీరో) చిత్రంతో, సూపర్స్టార్ కృష్ణ తనయుడు రమేశ్బాబు ‘సామ్రాట్’ (హిందీలో బేతాబ్) చిత్రంతో ఆయన ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. జగపతిబాబు తొలిచిత్రం ‘సింహస్వప్నం’ దర్శకుడు కూడా మధుసూదనరావే. పద్మాలయా వారు తీసిన హిందీ ‘లవ్ కుశ్’ (1997) చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ‘గుడిగంటలు’, ‘ప్రజానాయకుడు’, ‘కాంచనగంగ’ తదితర చిత్రాలు రాష్ట్ర ప్రభుత్వ నందులు గెలుచుకున్నాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధ చిత్రీకరణలో నేటికీ గొప్ప చిత్రంగా అందరూ భావించే ‘రక్తసంబంధం’లో చాలా దృశ్యాలు ఆయన స్వీయానుభవాలే.
అమ్మో.. మధుసూదనరావు కోపిష్టి
మధుసూదనరావుకు (victory madhusudhan rao) కోపమెక్కువ అనే ప్రచారం చిత్రసీమలో విస్తృతంగా ఉండేది. ఆ కోపం చేసే పనిలో పూర్తి నాణ్యత కోసమే అని దగ్గరగా ఎరిగినవారు చెబుతారు. ‘‘ఆయన టేకింగులో తికమక ఉండదు. డ్రామా పండించటంలో దిట్ట. ఆ కోపం కొంతసేపే’’ అని అక్కినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామానాయుడు తీసిన ‘చక్రవాకం’ చిత్రం షూటింగులో జరిగిన ఓ ఘటన ఆయన పనితీరుకు నిదర్శనం. క్లైమాక్స్లో కథానాయకుడు శోభన్బాబు ఆందోళనతో పరుగున నది వద్దకు వస్తాడు. నది పోటు మీద ఉందని, వెళ్లొద్దని పడవవాడు చెబుతాడు. ఈ పాత్ర పోషిస్తున్న అప్పటి సహాయ దర్శకుడు కాట్రగడ్డ మురారి (గోరింటాకు నిర్మాత) డైలాగు సరిగా చెప్పలేదు. ఆ సీను ముగిస్తే పేకప్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్న దర్శకుడు మధుసూదనరావు విసురుగా వెళ్లి.. ప్యాంటూ చొక్కా విప్పదీసి తువాలు చుట్టుకొని పడవవాడి పాత్ర తానే పోషించి చకచకా కారెక్కి వెళ్లిపోయారు.
* భార్య సరోజిని.. మధుసూదనరావు ఆదర్శాలకు తగ్గ ఇల్లాలు. పార్టీ కోసం పనిచేసేందుకు సంతానం అడ్డుగా ఉంటుందని భావించిన ఇద్దరూ తొలిచూలుకు అబార్షను చేయించారు. ఆ తర్వాత పెద్దలు సర్దిచెప్పటంతో ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చారు. సావిత్రి దర్శకత్వంలో అందరూ మహిళలు పనిచేయగా వచ్చిన చిత్రం ‘చిన్నారి పాపలు’ (1968)లో స్క్రీన్ప్లే రచయితగా సరోజిని భాగస్వామ్యం కూడా ఉంది.
* ప్రముఖ నటుడు జగతిబాబు తండ్రి వి.బి.రాజేంద్ర ప్రసాద్ స్థాపించిన జగపతి ఆర్ట్స్ పిక్చర్స్కు ఆస్థాన దర్శకుడీయన. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించాక తొలి రెండు చిత్రాలు ‘లక్షాధికారి’, ‘జమిందార్’లకు దర్శకుడు కూడా మధుసూదనరావే. నటుడు శోభన్బాబు గురువుగా అభిమానించేవారు. ‘వీరాభిమన్యు’తో శోభన్కు తొలి వందరోజుల చిత్రాన్ని అందించి స్టార్డం తీసుకువచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషనులో ‘మనుషులు మారాలి’, ‘జేబుదొంగ’, ‘మల్లెపూవు’, ‘కల్యాణమంటపం’ తదితర 13 చిత్రాలు వచ్చాయి. ఇందులో పది చిత్రాలు హిట్. కల్యాణమంటపం చిత్రాన్ని మధుసూదనరావే నిర్మించారు. నటి కాంచనకు సైతం ఆయన ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.
* ఏఎన్నార్తో దాదాపు 20 సినిమాలు తీసిన మధుసూదనరావు ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆత్మీయులు లాంటి చిత్రాలతో ఆయనకు ఘన విజయాలు అందించారు. ఇందులో ‘అంతస్తులు’ (1967) ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకొంది. ‘పవిత్రబంధం’ (1971) చిత్రంలో ఆ రోజుల్లోనే మధుసూదనరావు చిత్రీకరించిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది.. నెహ్రు కోరిన సంఘమా ఇది’ అనే ఆరుద్ర గీతం తనలోని అభ్యుదయ భావాలకు ప్రతీక.
జి.ఎస్.జమీర్ హుసేన్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్గుడ్ స్టోరీ.. పవన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్దత్ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి