ఏఎన్నార్కి ఇచ్చే నిజమైన నివాళి అదే
‘‘సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. నాకు తెలిసి చివరి రోజుల వరకూ నటించింది ఆయనొక్కరే. భావి తరాలు నేర్చుకోదగ్గ విలువలు, సంప్రదాయాల్ని పాటించారు. ఆ మార్గాన్ని అనుసరించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి’’ అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు.
‘‘సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. నాకు తెలిసి చివరి రోజుల వరకూ నటించింది ఆయనొక్కరే. భావి తరాలు నేర్చుకోదగ్గ విలువలు, సంప్రదాయాల్ని పాటించారు. ఆ మార్గాన్ని అనుసరించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి’’ అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ఆ భాష, ఆ వేషం, ఆ నటన, ఆ వ్యక్తిత్వం... వీటిలో కొంతైనా అంది పుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ప్రారంభమైన సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం హాజరైన ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులని ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు.
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
‘‘అక్కినేని నాగేశ్వరరావు సజీవ శిల్పాన్ని చెక్కిన శిల్పులకి అభినందనలు. నాగేశ్వరరావే ఉన్నారా! అన్నట్టుగా జీవకళ ఉట్టిపడుతోంది. ఆయన మహానటులు, మహామనిషి. నాకు వ్యక్తిగతంగానూ పరిచయం ఉంది. చక్కటి తెలుగు మాట్లాడేవారు. అదే సంప్రదాయాన్ని వారి కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు కనుమరుగవుతోందనే భయం కలుగుతోంది. తెలుగు భాషా ప్రోత్సాహానికి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి తరుణంలో మనందరం కూడా ఏఎన్నార్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషపై ఎంతో మక్కువ ఆయనకి. భాష పోతే మన శ్వాసే పోతుంది. ఒక అలవాటుగా, పట్టుదలగా ప్రతి ఒక్కరూ ఇంట్లో, వీధిలో, గుడిలో అమ్మ ఒడి నుంచి వచ్చిన భాషని మాట్లాడుకోవల్సిన అవసరం ఉంది. భాష పరిరక్షణకి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడితే చాలు. అలాగే ఏ రంగంలో ఉన్నప్పటికీ విలువలు పాటించాలి. అవి పాటించడం కూడా కష్టమైన పనేమీ కాదు. విలువలకి సజీవ దర్పణం అక్కినేని. ప్రేమ, అభిమానం, వాత్సల్యంతో పిల్లల్ని పెంచారు. ఇప్పుడు వాళ్ల వేషభాషలు సంప్రదాయ పద్ధతుల్లోనే ఉన్నాయి. గుడివాడ ప్రాంతంలో అటూ ఇటూ పుట్టిన ఇద్దరు మహావ్యక్తులు మహానటులు అయ్యారు. తెలుగు సినిమా కళారంగానికి రెండు కళ్లలాగా ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఏఎన్నార్.
నాగేశ్వరరావు గొప్పతనం ఎప్పటికప్పుడు తన జీవితాన్ని మదింపు చేసుకోవడం. ఎలాంటి సినిమా అయినా అందులో ఒదిగిపోయేలా నటించి, పాత్రకి సజీవ దర్పణంలా నిలిచేవారు. ఒక పెద్ద నటనా విశ్వవిద్యాలయం ఏఎన్నార్. సినిమా రంగంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థిననుకుని ఆ గుణ గణాల్ని, లక్షణాల్ని కొంత అందిపుచ్చుకుంటే చాలు... వాళ్ల జీవితాల్ని మెరుగు పరుచుకున్నట్టే’’.
జవసత్వంతోనే వారసత్వం
‘‘అక్కినేని నాస్తికుడైనా కూడా పెద్ద తాత్వికుడు. వ్యక్తిగత జీవితంలో ఆడంబరాలు అతి అంచనాలతో కాకుండా వాస్తవ భౌతిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఉన్నత స్థానానికి వెళ్లిన విలక్షణ వ్యక్తి ఏఎన్నార్. తన సినిమాలతో సమాజానికి మంచి జరగకపోయినా, చెడు మాత్రం జరగకూడదని అక్కినేని నాగేశ్వరరావు బలంగా నమ్మారు. తన సినిమాల్లో సందేశం, విజ్ఞానం ఉండాలని భావించేవారు. ఆ స్ఫూర్తితోనే నేటితరం సినిమా తీయాలి, నటించాలి. ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న భాష ఏమాత్రం బాగోలేదు. విపరీతార్థాలు, ద్వంద్వార్థాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంభాషణలతో యువతరాన్ని, మన కుటుంబ వ్యవస్థని నాశనం చేసుకుంటామనే విషయాన్ని దర్శకులు రచయితలు గుర్తిస్తే మంచిది. రాజకీయాల్లో వారసత్వానికి వ్యతిరేకం. సినిమా, వైద్యం, సేవ రంగాల్లో వారసత్వాన్ని ప్రోత్సహిస్తా. కష్టపడితే వస్తుంది ఆ వారసత్వం ఊరికే రాదు. వారసత్వం కావాలంటే జవసత్వం ఉండాలి. అవన్నీ ఒనగూర్చుకుని అక్కినేని వారసులు నిలబెడుతున్నారు. వారందకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’’ అన్నారు వెంకయ్యనాయుడు.
ఈ కార్యక్రమంలో ఏఎన్నార్ కుటుంబ సభ్యులతోపాటు, సినీ ప్రముఖులు మోహన్బాబు, బ్రహ్మానందం, జయసుధ, రాజేంద్రప్రసాద్, ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, మహేశ్బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్చరణ్, జగపతిబాబు, శ్రీకాంత్, అల్లు అరవింద్, అశ్వినీదత్, దిల్రాజు, మురళీమోహన్, సుబ్బరామిరెడ్డి. సి.కల్యాణ్, ఎస్.రాధాకృష్ణ, ఎస్.గోపాల్రెడ్డి, అనుపమ్ ఖేర్, నాజర్, మంచు విష్ణు, నాని, వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు కామినేని శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డీజీపీ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మా గుండెల్ని ప్రేమతో నింపారు నాన్న
- నాగార్జున
‘‘ఎవరి విగ్రహమైనా చూస్తే వాళ్లు మహానుభావులు, మనతో లేరనే అభిప్రాయం నాకు చిన్నప్పట్నుంచే కలిగింది. ఆ విగ్రహం చూసినప్పుడల్లా మనల్ని వదిలేసి వెళ్లిపోయారని అనిపిస్తుంటుంది. అందుకే ఆవిష్కరణ వరకూ నాన్న విగ్రహం చూడలేదు. నాన్న మాతో లేరనేది ఇక నేను స్వీకరించాలి. శిల్పి వినీశ్ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారు. నాన్న అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ఏఎన్నార్ అనగానే తరతరాలు గుర్తు పెట్టుకునే పాత్రల్ని చేసిన నటులు... భారతదేశం ఎన్నో రకాలుగా సత్కరించిన నటులు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం మా గుండెల్ని ప్రేమతో నింపిన వ్యక్తి. నాకే కాదు, నా తోబుట్టువులు, పిల్లల్ని చల్లగా చూసిన వ్యక్తి, ఇంటికి వెళ్లినప్పుడల్లా చిరునవ్వుతో మమ్మల్ని దగ్గరికి తీసుకునేవారు మా నాన్నగారు. మాకు మనసు బాగున్నా, బాగోలేకపోయినా ఆయన దగ్గరికి వెళ్లేవాళ్లం. మనసు ప్రశాంతంగా అనిపించేది. నాన్నకి బాగా నచ్చిన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియోస్. నచ్చిన ప్రదేశంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్టు అంటారు. ఆయన అలాగే ప్రాణంతో మా మధ్య ఉన్నారని, మా మధ్యే నడుస్తున్నారని అనుకుంటాం’’ అన్నారు. +
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. డిసెంబరు 1న ఈ సినిమా విడుదలకానున్న సందర్భంగా రణ్బీర్పై ప్రత్యేక కథనం.. -
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
కిరాక్ ఆర్పీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. -
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సరదాగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. -
Telangana Assembly Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తారలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీతారలు ఆసక్తి చూపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చొని, ఓటు వేశారు. అనంతరం సోషల్మీడియా వేదికగా.. ‘‘మేము మా బాధ్యత నిర్వర్తించాం. మరి మీరు?’’ అంటూ పోస్టులు పెట్టారు.
-
Salaar: ప్రభాస్కి తగ్గ కథ సలార్
‘కె.జి.ఎఫ్’ ప్రపంచానికి, ‘సలార్’ కథకీ సంబంధం లేదన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ రెండూ భిన్నమైన కథలు, భావోద్వేగాలతో రూపొందించిన చిత్రాలనీ, ‘సలార్’ కూడా దానిదైన మరొక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని తెలిపారు. -
Vikram K Kumar: వంద రోజులు వర్షంలోనే చిత్రీకరించాం
‘‘ఒక సినిమా తీశాక దాని ఫలితం శుక్రవారం తొలి ఆటలోపే తెలిసిపోతుంది. కానీ వెబ్సిరీస్ల ఫలితం కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలో తెలియదు. సినిమాతో పోలిస్తే ఈ విషయంలోనే నాలో ఎక్కువ ఒత్తిడి ఉంది. -
War 2: హృతిక్, ఎన్టీఆర్ల వార్ 2 అప్పుడే
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టీ ‘వార్ 2’పైనే ఉంది. తెలుగు, హిందీ భాషలకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు తెరపై కనిపిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపించబోతున్నారు హృతిక్ రోషన్, ఎన్టీఆర్. -
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
సినిమాల విషయంలో తనకు విశాఖపట్నం ప్రత్యేకమని హీరో నాని అన్నారు. తన కొత్త సినిమా ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. -
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
తాను దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యానిమల్’ డిసెంబరు 1న విడుదల కానున్న సందర్భంగా సందీప్ రెడ్డి వంగా పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Double Ismart: ఇస్మార్ట్ కౌంట్డౌన్
వంద రోజుల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ సందడి షురూ అవుతోందంటూ కౌంట్డౌన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. రామ్ పోతినేని కథానాయకుడిగా... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
Atharva: ఆ ప్రశ్న నుంచి పుట్టిందే అథర్వ
‘‘ఎలాంటి ఆధారాలు లేని ఓ క్లిష్టమైన కేసు ఎలా పరిష్కారమైందనే ఆసక్తికరమైన కథతోనే ‘అథర్వ’ తెరకెక్కింద’’న్నారు కార్తీక్రాజు. పోలీసు అధికారి కావాలనే కోరిక ఉన్నా, కాలేకపోయిన ఓ యువకుడిగా తాను కనిపిస్తానన్నారు. -
Ranbir Kapoor: అలియానే ధైర్యం చెప్పేది
‘‘యానిమల్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా భయపడ్డా. ఆ సమయంలో నా భార్య అలియా భట్ నాకు ధైర్యం చెప్పింది’ అంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు రణ్బీర్ కపూర్. -
Manchu Manoj: ‘ఉస్తాద్’ ఆట మొదలు
వెండితెరపై నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకులు బుల్లి తెర హోస్ట్లుగా అదరగొడుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలోకి రానున్నారు కథానాయకుడు మంచు మనోజ్. -
Nithya Menen: ప్రేమకి సమయం లేదు!
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తూ, సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే నాయిక నిత్యా మేనన్. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలూ చేస్తున్న ఈ భామ.. ఇప్పుడు మరో కొత్త కథతో రావడానికి ముస్తాబవుతోంది. -
Sudheer: ఓటు వేయండి... మా చిత్రాన్ని చూడండి
‘నా నటనలోని మరో కోణాన్ని చూపించే అవకాశం ‘కాలింగ్ సహస్ర’ ఇచ్చింది. ఈ సినిమాతో నేను చేసిన కొత్త ప్రయత్నం కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంద’న్నారు సుడిగాలి సుధీర్. -
Tollywood: ‘మెకానిక్’ సందడి
మణిసాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్.. ఉపశీర్షిక. ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నారు. నాగ మునెయ్య నిర్మాత. డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ