వెండితెర చంద్రిక.. వహీదాకు ఫాల్కే పురస్కారం
తమిళనాట పుట్టి... తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి.. హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రెహమాన్ (85). అయిదు దశాబ్దాలపాటు భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరించి, చిత్రసీమకు ఆమె చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మంగళవారం ప్రకటించింది.
తెలుగు సినిమాతో నటిగా పరిచయం..
బాలీవుడ్ అగ్రనాయకిగా ప్రస్థానం
దిల్లీ: తమిళనాట పుట్టి... తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి.. హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రెహమాన్ (85). అయిదు దశాబ్దాలపాటు భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరించి, చిత్రసీమకు ఆమె చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మంగళవారం ప్రకటించింది. ఏఎన్నార్ నటించిన తెలుగు చిత్రం ‘రోజులు మారాయి’ (1955)తో వెండితెరపై మెరిసిన వహీదా.. అందులో ‘ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా..’ అనే పాటకు చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి ‘జయసింహ’లో నటించాక.. హిందీ చిత్రసీమలోకి ఆమె అడుగు పెట్టారు. కొంత విరామం తర్వాత ‘బంగారు కలలు’, ‘సింహాసనం’, ‘చుక్కల్లో చంద్రుడు’ వంటి తెలుగు సినిమాల్లోనూ వహీదా నటించారు. తెలుగు చిత్రంతో పరిశ్రమకు పరిచయమైనా హిందీలోనే ఎక్కువగా నటించి కొన్నేళ్లపాటు బాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగారు. ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘కాలా బాజార్’, ‘బాత్ ఏక్ రాత్ కీ’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’, ‘నీల్కమల్’, ‘చౌదవీ కా చాంద్’, ‘రామ్ ఔర్ శ్యామ్’, ‘సీఐడీ’, ‘ఖామోశీ’ ఇలా ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ‘రేష్మా ఔర్ షేరా’తో తన నటనను శిఖరాగ్రానికి తీసుకెళ్లిన వహీదా అందులోని పాత్రకు జాతీయ ఉత్తమనటిగా ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం నుంచి 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను స్వీకరించారు. ‘శగున్’ చిత్రంలో ఆమెతో కలిసి నటించిన కమల్జీత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వహీదాకు ఇద్దరు పిల్లలు. కుటుంబమంతా బెంగళూరులో స్థిరపడ్డా.. భర్త మరణానంతరం ఆమె ముంబయికి తిరిగి వచ్చారు.
భారతీయ సినిమాకు పర్యాయపదం : అనురాగ్ ఠాకుర్
వహీదా రెహమాన్ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ మంగళవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. ‘‘భారతీయ సినీరంగ అభ్యున్నతికి తన నటనతో విశేష సేవలందించిన ప్రఖ్యాత నటి వహీదా రెహమాన్కు ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది’’ అన్నారాయన. పార్లమెంటులో నారీశక్తి వందన్ అధినియమ్ మహిళాబిల్లు ఆమోదం పొందిన ఈ సమయంలోనే.. భారతీయ సినిమాకు పర్యాయపదంలా నిలిచిన దిగ్గజ నటికి ఈ అవార్డు దక్కడం ముదావహమంటూ ఈ సందర్భంగా వహీదాకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఆమెది చెరగని అధ్యాయం : మోదీ
వహీదా రెహమాన్.. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నటనలో ఆమె ప్రతిభ అనన్య సామాన్యం. భారతీయ సినిమా చరిత్రలో ఆమె ప్రయాణం ఒక చెరగని గుర్తు. సినిమా వారసత్వంలో వహీదా ఒక మర్చిపోలేని అధ్యాయం. ఆమెకు నా శుభాకాంక్షలు’’ అని కొనియాడారు.
మరింత ఆనందం: వహీదా రెహమాన్
నేను చాలా సంతోషంగా.. రెట్టింపు ఆనందంలో ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు నా సహనటుడు దేవానంద్ శతజయంతి. ఆ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం గర్వంగా ఉంది. ప్రభుత్వం నన్ను గౌరవమైన పురస్కారానికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు వహీదా రెహమాన్. ఈ అవార్డును తాను ఊహించలేదన్నారు. ‘‘రెండేళ్లుగా సినిమాల్లో నటించడం లేదు. నేను ఎప్పుడూ ఏ అవార్డునూ ఆశించలేదు. ఈ పురస్కారం నాకు సరైనదని ప్రభుత్వం భావిస్తే తీసుకుంటాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేను: రాశీఖన్నా
భాష ఏదైనా.. నటనతో మెప్పిస్తూ, అన్నిచోట్లా దూసుకెళ్తోంది రాశీఖన్నా. ప్రస్తుతం విక్రమ్ మాస్సేకి జోడీగా ‘టీఎంఈ’లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. -
నేను రణ్బీర్కు చాలా పెద్ద అభిమానిని
‘‘ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త దర్శకులు వస్తుంటారు. పెద్ద సినిమాలు.. సూపర్ హిట్టు చిత్రాలు చేస్తుంటారు. కానీ, ‘సినిమా అంటే ఇలాగే తీయాలి’ అనే సినీ సూత్రాల్ని షేక్ చేసే దర్శకుడు అప్పుడప్పుడు ఒకరు వస్తుంటారు. -
డ్యాన్స్ కొత్తగా.. కొంచెం మత్తుగా
‘డెవిల్’గా సినీప్రియుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కల్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త కథానాయిక. -
జన్మించాడు ఓ లెజెండ్
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. -
నా కొంపెట్లా ముంచనున్నావో చెప్పు రాధికా..
‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన మరోసారి అదే పాత్రలో ‘టిల్లు స్క్వేర్’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. -
భయపడితే కాదు.. భయపెడితేనే..!
‘‘వాడు సమరమే మొదలుబెడితే.. ఆ సంభవానికి సంతకం నాదైతది’’ అంటున్నారు సుధీర్బాబు. మరి ఆ సమరం దేనికోసం.. అందులో పైచేయి సాధించేదెవరు? తెలుసుకోవాలంటే ‘హరోం హర’ చూడాల్సిందే. -
Vishwak Sen: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వాయిదా.. చిత్ర బృందం అధికారిక ప్రకటన
విశ్వక్సేన్, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా వాయిదా పడింది. -
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదేంటంటే? -
క్లైమాక్స్ను ఎవరూ ఊహించలేరు
‘‘సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా ‘అథర్వ’. ప్రతి ఒక్కరినీ సీటు అంచున కూర్చోబెట్టేలా సాగుతుంది’’ అన్నారు దర్శకుడు మహేశ్రెడ్డి. -
నా నిజ జీవిత ప్రేమ కథల ఫలితమే ఈ చిత్రం
‘లవ్ మౌళి’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నవదీప్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర తెరకెక్కించారు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ నిర్మించింది. -
గోదావరి గ్యాంగ్ విడుదల!
విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. -
పదింతల వినోదం గ్యారంటీ
‘‘నా 20ఏళ్ల కెరీర్లో.. ‘ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్’ నా 32వ సినిమా. నేనిప్పటి వరకు చేసిన అత్యుత్తమ పాత్రల్లో ఇందులో చేసిన పాత్రే నంబర్ వన్’’ అన్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రమే ‘ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్’.