కియారా, సిద్ధార్థ్‌ ప్రేమలో ఉన్నారా..?

‘ఫగ్లీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ ‘ఎం.ఎస్‌.ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అడ్వాణీ. ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. తాజాగా ఈ చిన్నది న్యూ ఇయర్‌ సందర్భంగా షూటింగ్స్‌ నుంచి కొంత విరామం తీసుకుని ఆఫ్రికా టూర్‌కు వెళ్లారు...

Published : 04 Jan 2020 13:21 IST

ముంబయి: ‘ఫగ్లీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ ‘ఎం.ఎస్‌.ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కియారా అడ్వాణీ. ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. తాజాగా ఈ చిన్నది న్యూ ఇయర్‌ సందర్భంగా షూటింగ్‌ నుంచి కొంత విరామం తీసుకుని ఆఫ్రికా టూర్‌ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా ఆఫ్రికాలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు. దీంతో కియారా, సిద్ధార్థ్‌ కలిసే టూర్‌కు వెళ్లారంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆఫ్రికా నుంచి ముంబయికు చేరుకున్న కియారా అడ్వాణీ పక్కనే సిద్ధార్థ్‌ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

గతేడాది విడులైన ‘కబీర్‌సింగ్‌’, ‘గుడ్‌న్యూస్‌’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు కియారా అడ్వాణీ. ప్రస్తుతం ఆమె కిట్టీలో ‘లక్ష్మిబాంబ్‌’, ‘ఇండోకి జనానీ’, ‘షెర్‌షా’ చిత్రాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని