ఆ హీరో సినిమా నుంచి కీర్తి తప్పుకొన్నారా?

దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘మైదాన్‌’ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించారు. బోనీ కపూర్‌ ఈ సినిమాకు నిర్మాతగా...

Published : 17 Jan 2020 15:18 IST

ముంబయి: దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘మైదాన్‌’లో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించారు. బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1952 నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి కీర్తి సురేశ్‌ తప్పుకొన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె, బోనీ పరస్పరం ఒప్పందానికి వచ్చారట. సినిమాలోని పాత్రకు కీర్తి సురేశ్‌ సరిపోవడం లేదని తెలిసింది. అజయ్‌ భార్య పాత్రకు తగినట్లు లేరని, చాలా తక్కువ వయసు అమ్మాయిలా కనిపిస్తున్నారని చెబుతున్నారు. బాలీవుడ్‌ ఎంట్రీకి ఇది సరైన సినిమా కాదని కీర్తి అభిప్రాయపడ్డారట. ఈ నేపథ్యంలో ఆమె చిత్రం నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘మైదాన్‌’ను ప్రకటించినప్పుడు కీర్తి సురేశ్‌ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు నా పాత్ర గురించి మాట్లాడకూడదు. కానీ అందరికీ తెలియని ఈ కథలో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది. ఇది అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించే ఓ భావోద్వేగపు ప్రయాణం’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని