మరోసారి జంటగా మహేశ్-కియారా..?
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ చిన్నది కియారా అడ్వాణీ. ఈ సినిమాలో మహేశ్ సరసన వసుమతిగా నటించి కియారా ప్రేక్షకులను మెప్పించారు. దీంతో ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం..
దర్శకుడికి సూచించిన నమ్రత
హైదరాబాద్: ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ చిన్నది కియారా అడ్వాణీ. ఈ సినిమాలో మహేశ్ సరసన ‘వసుమతి’గా నటించి కియారా ప్రేక్షకులను మెప్పించారు. దీంతో ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేశ్ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేయనున్నారంటూ టాలీవుడ్లో టాక్. ఈ సినిమాలో మహేశ్కు జంటగా కియారా అడ్వాణీ అయితే బాగుంటుందని నమ్రత దర్శకుడికి సూచించారట. నమ్రత మాట ప్రకారం వంశీ సైతం కియారానే కథానాయికగా ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వంశీ పైడిపల్లి-మహేశ్ కాంబినేషన్లో వచ్చిన ‘మహర్షి’ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా వరుస సినిమాలతో బిజీబిజీగా లైఫ్ను గడిపిన మహేశ్ కొంతకాలంపాటు షూటింగ్లకు దూరంగా ఉండాలని భావించారు. ఇందుకోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ టూర్కు వెళ్లారు. టూర్ నుంచి వచ్చాకే మహేశ్ తన కొత్త సినిమా విశేషాలను వెల్లడించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా