ఆ దర్శకుడితో శర్వా..?

యువ కథానాయకుడు శర్వానంద్‌ జోరు మీదున్నారు. వరుసగా  సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘జాను’, ‘శ్రీకారం’ చిత్రాలతో బిజీగా

Published : 29 Jan 2020 17:36 IST

యువ కథానాయకుడు శర్వానంద్‌ జోరు మీదున్నారు. వరుసగా  సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘జాను’, ‘శ్రీకారం’ చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. ‘జాను’ ఫిబ్రవరిలో వస్తోంది. వేసవిలో ‘శ్రీకారం’ విడుదలవుతోంది. ఈలోగా మరో కథకీ పచ్చజెండా ఊపేశారు శర్వా. కిషోర్‌ తిరుమలతో ఆయన ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ చిత్రాలతో ఆకట్టుకున్నారు కిషోర్‌ తిరుమల. ఇప్పుడు రామ్‌తో ‘రెడ్‌’ చేస్తున్నారు. అది  పూర్తయిన వెంటనే శర్వాతో సినిమా మొదలెడతారని తెలుస్తోంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని