అనసూయ అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిందా?
తన మాటలు, పంచ్లతో బుల్లితెర ప్రేక్షకులను రంజిపజేస్తున్న వ్యాఖ్యాత, నటి అనసూయ. అవకాశం వస్తే, వెండితెరపై తన నటనతో
ఇంటర్నెట్డెస్క్: తన మాటలు, పంచ్లతో బుల్లితెర ప్రేక్షకులను రంజిపజేస్తున్న వ్యాఖ్యాత, నటి అనసూయ. అవకాశం వస్తే, వెండితెరపై తన నటనతో ఎలా మెప్పిస్తుందో ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా చూపించింది. అటు అభిమానులతో పాటు, ఇటు సినీ విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పాత్రను దక్కించుకున్నట్లు టాలీవుడ్ టాక్. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రకు చిత్ర బృందం అనసూయను సంప్రదించిందట.
మొగలాయుల కాలం నాటి కథతో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయనకు సహాయపడే ఓ కీలక పాత్రలో అనసూయ కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర చేయడానికి ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. మార్చి నుంచి సెట్స్పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖర్లో కానీ, వచ్చే సంక్రాంతికి కానీ విడుదల చేసే అవకాశముంది.
మరోవైపు సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ అనసూయ అవకాశం దక్కించుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ అనసూయ డబుల్ ధమాకా కొట్టేసినట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్