అఘోరాగా కనిపించేందుకు..

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విజయవంతమైన ఈ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. బాలకృష్ణ

Updated : 11 Feb 2020 10:18 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విజయవంతమైన ఈ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. బాలకృష్ణ రెండు కోణాలతో కూడిన పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆయన సరసన ఇద్దరు కథానాయికలు ఆడిపాడబోతున్నారు. ఇదివరకే ఈ సినిమా ప్రారంభమైంది. చిత్రీకరణ ఈ నెల 26న వారణాసిలో మొదలు కాబోతోంది. కథ వారణాసి నేపథ్యంలోనే సాగుతుందని సమాచారం. బాలకృష్ణ కొన్ని సన్నివేశాల్లో అఘోరాగా కనిపిస్తారట. అందుకు సంబంధించిన లుక్‌పై కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని