‘V’ అసలు కథ అదేనా..?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా థామస్, అదితిరావు హైదరీ కథానాయికలు. ఈ సినిమాలో సుధీర్ పోలీస్గా...
హైదరాబాద్: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నివేదా థామస్, అదితిరావు హైదరీ కథానాయికలు. ఈ సినిమాలో సుధీర్ పోలీస్గా నటిస్తుండగా, నాని ప్రతినాయకుడి లక్షణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ‘వి’ టీజర్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఒకానొక సమయంలో యూఎస్లో జరిగిన సీరియల్ కిల్లింగ్స్ను ఆధారంగా చేసుకుని మోహన్ కృష్ణ ‘వి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, అంతేకాకుండా సదరు కిల్లర్ హత్య చేసిన ప్రతి చోటా తన ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని అక్కడ రాసేవాడని.. అలాగే ఈ సినిమాలో కూడా మర్డర్ చేసిన ప్రతిచోటా కిల్లర్ ‘వి’ అనే లెటర్ పెడతాడని.. అందుకే ఈ సినిమాకి ‘వి’ అనే టైటిల్ పెట్టారని రూమర్స్ వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట