‘ఖైదీ’ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌..!

ఈమధ్య దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే పెద్దపెద్ద బాలీవుడ్‌ హీరోలు సైతం ఆ సినిమాల రీమేక్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Published : 24 Feb 2020 21:04 IST

ముంబయి: ఈమధ్య దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే పెద్దపెద్ద బాలీవుడ్‌ హీరోలు సైతం ఆ సినిమాల రీమేక్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ చిత్రాలను బాలీవుడ్‌ వరుసగా రీమేక్‌ చేస్తోంది. కార్తీ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘ఖైదీ’ మంచి విజయం సాధించడంతో ఆ సినిమాను బాలీవుడ్‌లో రిలియన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మాణ సంస్థ, డ్రీమ్‌ వారియర్స్‌తో కలిసి రీమేక్‌ చేసే పనిలో పడింది. ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్‌ హీరోగా చేస్తున్నారని.. కాదుకాదు.. హృతిక్‌రోషన్‌ ఇప్పటికే ఖరారైపోయారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. అందులో కథానాయకుడిగా అజయ్‌దేవ్‌గణ్‌ చేస్తున్నట్లు సమాచారం. చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే ఆయనను సంప్రదించగా దానికి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 

తమిళంలో కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ చిత్రానికి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. సినిమా ఒప్పుకొనే ముందు అజయ్‌ ఖైదీ సినిమాను చూశారట. హిందీలోనూ కథ విన్నారట. ఈ సినిమాలో అజయ్‌ హీరోగా చేసేందుకు సంతకం చేసినట్లు చిత్ర యూనిట్‌ ద్వారా తెలిసింది. సినిమా చిత్రీకరణ షెడ్యూలింగ్‌ గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అజయ్‌దేవగణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌2, హిందీలో మైదాన్‌ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని